ETV Bharat / bharat

రెట్టింపైన ఖైదీల అసహజ మరణాలు

2015-16 మధ్యకాలంలో ఖైదీల అసహజ మరణాలు 100.87 శాతం పెరిగినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో ఓ నివేదికలో వెల్లడించింది. మొత్తం 231 మంది అసహజంగా మరణించగా... ఇందులో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 102.

author img

By

Published : Apr 16, 2019, 4:47 PM IST

Updated : Apr 16, 2019, 7:26 PM IST

రెట్టింపైన ఖైదీల అసహజ మరణాలు
రెట్టింపైన ఖైదీల అసహజ మరణాలు: ఎన్​సీఆర్​బీ

కారాగారాల్లో ఖైదీల అసహజ మరణాలు 2015తో పోల్చితే 2016లో రెట్టింపయ్యాయి. 2015లో 115 మంది మరణించగా, 2016లో ఈ సంఖ్య 231కి చేరింది. అంటే 100.87 శాతం మరణాలు ఎక్కువయ్యాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో 'ప్రిజన్​ స్టేటస్టిక్స్​ ఇండియా 2016' పేరుతో నివేదిక విడుదల చేసింది.

మొదటి స్థానంలో యూపీ

ఎన్​సీఆర్​బీ నివేదిక ప్రకారం 231 మందిలో 102 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. 14 మంది ఇతర ఖైదీల చేతిలో మరణించారు. 9 మంది ప్రమాదవశాత్తు చనిపోయారు. ఒకరు బయటి వ్యక్తుల దాడిలో మృతి చెందారు. 103 మంది ఖైదీల మృతి కారణాలపై ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. 3 ఏళ్ల తర్వాత ఎన్​సీఆర్​బీ ఈ వివరాలు ప్రకటించింది.

అసహజ మరణాల్లో ఉత్తరప్రదేశ్ (56) మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర (47), పంజాబ్​ (37), తమిళనాడు (11) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్​లో అత్యధికంగా 20 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడు, హరియాణాలో తొమ్మిదేసి మంది, పంజాబ్​, రాజస్థాన్​లో 8 మంది బలవన్మరణం చెందారు.

ఏళ్ల పాటు జైల్లో...

దేశవ్యాప్తంగా 11, 834 మంది విచారణ ఖైదీలు 3-4 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. 3,927 మంది ఐదేళ్ల కంటే ఎక్కువే కారాగారాల్లో మగ్గారు.

దేశవ్యాప్తంగా ఉన్న కారాగారాల సంఖ్య 4,33,003. ఇందులో ఉత్తరప్రదేశ్​లోనే 26,785 జైళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 26,785 మంది నేరస్థులు బందీలుగా ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న నేరస్థుల్లో 19.7 శాతం మంది ఉత్తరప్రదేశ్​లోనే జైలు జీవితం గడిపారు.

ఇదీ చూడండి: 'మోదీలందరూ దొంగలే అనడం తగునా?'

రెట్టింపైన ఖైదీల అసహజ మరణాలు: ఎన్​సీఆర్​బీ

కారాగారాల్లో ఖైదీల అసహజ మరణాలు 2015తో పోల్చితే 2016లో రెట్టింపయ్యాయి. 2015లో 115 మంది మరణించగా, 2016లో ఈ సంఖ్య 231కి చేరింది. అంటే 100.87 శాతం మరణాలు ఎక్కువయ్యాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో 'ప్రిజన్​ స్టేటస్టిక్స్​ ఇండియా 2016' పేరుతో నివేదిక విడుదల చేసింది.

మొదటి స్థానంలో యూపీ

ఎన్​సీఆర్​బీ నివేదిక ప్రకారం 231 మందిలో 102 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. 14 మంది ఇతర ఖైదీల చేతిలో మరణించారు. 9 మంది ప్రమాదవశాత్తు చనిపోయారు. ఒకరు బయటి వ్యక్తుల దాడిలో మృతి చెందారు. 103 మంది ఖైదీల మృతి కారణాలపై ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. 3 ఏళ్ల తర్వాత ఎన్​సీఆర్​బీ ఈ వివరాలు ప్రకటించింది.

అసహజ మరణాల్లో ఉత్తరప్రదేశ్ (56) మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర (47), పంజాబ్​ (37), తమిళనాడు (11) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్​లో అత్యధికంగా 20 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడు, హరియాణాలో తొమ్మిదేసి మంది, పంజాబ్​, రాజస్థాన్​లో 8 మంది బలవన్మరణం చెందారు.

ఏళ్ల పాటు జైల్లో...

దేశవ్యాప్తంగా 11, 834 మంది విచారణ ఖైదీలు 3-4 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. 3,927 మంది ఐదేళ్ల కంటే ఎక్కువే కారాగారాల్లో మగ్గారు.

దేశవ్యాప్తంగా ఉన్న కారాగారాల సంఖ్య 4,33,003. ఇందులో ఉత్తరప్రదేశ్​లోనే 26,785 జైళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 26,785 మంది నేరస్థులు బందీలుగా ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న నేరస్థుల్లో 19.7 శాతం మంది ఉత్తరప్రదేశ్​లోనే జైలు జీవితం గడిపారు.

ఇదీ చూడండి: 'మోదీలందరూ దొంగలే అనడం తగునా?'

Barabanki (UP), Apr 16 (ANI): The Election Commission of India (ECI) suspended four Indian Railways' employees, including two reservation clerks, one Chief Reservation Supervisor and a Commercial Inspector after tickets with the photograph of Prime Minister Narendra Modi printed on them was issued to passengers at the Barabanki railway station due to violation of Moral Code of Conduct (MCC) on Monday. Sub Divisional Magistrate (SDM) Sandeep Gupta said, "On 13 April, when shift changes, the old roll featuring Prime Minister was mistakenly used. However, we were directed to use a new roll after the MCC came into effect. As boxes of both the rolls were same, the employees mistakenly took out the box which had an old roll." Lok Sabha elections in Uttar Pradesh are being held from April 11 and will go on till May 19 in all seven phases. Counting of votes will take place on May 23."
Last Updated : Apr 16, 2019, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.