జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలు లక్ష్యంగా గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ద్రాబ్గమ్లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద గస్తీ నిర్వహిస్తున్న బృందంపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. భద్రతా సిబ్బందిపైకి 6-7 రౌండ్లు కాల్పులు జరపగా.. బలగాలు సైతం దీటు సమాధానమిచ్చాయని అధికారులు వెల్లడించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు బలగాలు ముష్కరుల కోసం గాలిస్తున్నాయి. కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.
ఇదీ చూడండి: సౌదీ రాజధానిలో కీలక ప్రసంగం చేయనున్న మోదీ