ETV Bharat / bharat

ఆటంకాలు ఎదురైనా.. జోరుగా సహాయక చర్యలు

ఉత్తరాఖండ్‌ జలవిలయంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు నాలుగో రోజు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 32 మృతదేహాలు లభ్యం కాగా.. మిగతా వారి ఆచూకీ కోసం సహాయ బృందాలు అన్వేషిస్తున్నాయి. సొరంగం నుంచి బయటకు వస్తున్న బురద.. సహాయ చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. మరోవైపు... సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని తప్పిపోయిన కార్మికుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ ఆత్మీయుల కోసం పడిగాపులు గాస్తున్నారు.

author img

By

Published : Feb 10, 2021, 4:54 PM IST

ఆటంకాలు ఎదురైనా జోరుగా సహాయక చర్యలు

ఉత్తరాఖండ్​లో మంచు చరియలు, నదీ ప్రవాహం సృష్టించిన విలయంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు నాలుగో రోజు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 32 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 174 మంది ఆచూకీ తెలియలేదు.

U'khand disaster
టన్నెల్​ లోపల సహాయక చర్యలు

ముఖ్యంగా తపోవన్​ విద్యుత్​ కేంద్రంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న సుమారు 35 మందిని సురక్షితంగా వెలికితీసేందుకు సహాయ బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. సైన్యం, ఇంటో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బలగాలు.. కాలంతో పోటీ పడి పనిచేస్తున్నాయి.

U'khand disaster
సహాయక చర్యల్లో ఐటీబీపీ, ఎన్​డీఆర్​ఎఫ్​ష ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది
U'khand disaster
తపోవన్​ జలవిద్యుత్​ కేంద్రం వద్ద గాలింపు చర్యలు

టన్నెల్​ లోపల చిక్కుకున్న వారిని కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్లు, రిమోట్​ సెన్సింగ్​ పరికరాలను వాడుతున్నారు.

తపోవన్​ వద్ద చినూక్​ హెలికాప్టర్​తో గాలింపు చర్యలు నిర్వహించారు.

U'khand disaster
చినూక్​ హెలికాప్టర్​తో గాలింపు

ఐటీబీపీ, ఆర్మీ, స్థానిక యంత్రాంగం అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై... సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.

U'khand disaster
తదుపరి కార్యాచరణ కోసం అధికారుల సమీక్ష

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: వరదలో కొట్టుకుపోయిన కార్మికులు

రెండున్నర కిలోమీటర్ల పొడవున్న సొరంగం నుంచి బయటకు వస్తున్న బురద.. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పరుస్తోంది. భారీ యంత్రాల ద్వారా బురదను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించారు. లోపల ఉన్న వారి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలను పంపినా.. అంతా చీకటిగా ఉండటం వల్ల పెద్దగా ఫలితం లేదు. మరోవైపు.. సొరంగంలో చిక్కుకుపోయిన తమవారి రాక కోసం కుటుంబసభ్యులు వేచి చూస్తున్నారు.

U'khand disaster
టన్నెల్​ లోపల జోరుగా సహాయక చర్యలు

హెలికాప్టర్లతో నిత్యవసరాలు సరఫరా..

హిమనీనదం సృష్టించిన జలవిలయంతో పలు గ్రామాలకు.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అక్కడి ప్రజలకు.. ఐటీబీపీ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా నిత్యవసరాలు సరఫరా చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లి.. వారికి ఆహార పదార్థాలను అందిస్తున్నారు.

ఫిబ్రవరి 7న జలప్రళయం ధాటికి ఛమోలీ సహా చుట్టుపక్కల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విష్ణుప్రయాగ్​లోని పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోడలకు బీటలు వారాయి.

బాధితుల బంధువులు ఆందోళన..

రిషిగంగ ప్రాజెక్ట్​ వద్ద పనిచేసే సుమారు 40 మంది కార్మికుల కుటుంబసభ్యులు బుధవారం నిరసనకు దిగారు. అలకనందా నదీ వద్ద జలవిలయం అనంతరం.. సహాయక చర్యలు సక్రమంగా చేపట్టలేదని ఆరోపించారు. ప్రాజెక్ట్​ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

''విషాదం జరిగి 4 రోజులైంది. ముఖ్యంగా రహదారుల పునరుద్ధరణపైనే వారందరి దృష్టి నెలకొంది. తప్పిపోయిన కార్మికులను కాపాడాలన్న ఉద్దేశం కనిపించట్లేదు.''

- ఓ బాధితుడి సోదరుడు

ఇదీ చూడండి: ఉత్తరాఖండ్​ వరదలు: ఆ పరికరంపైనే 'అణు'మానాలు

ఉత్తరాఖండ్​లో మంచు చరియలు, నదీ ప్రవాహం సృష్టించిన విలయంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు నాలుగో రోజు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 32 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 174 మంది ఆచూకీ తెలియలేదు.

U'khand disaster
టన్నెల్​ లోపల సహాయక చర్యలు

ముఖ్యంగా తపోవన్​ విద్యుత్​ కేంద్రంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న సుమారు 35 మందిని సురక్షితంగా వెలికితీసేందుకు సహాయ బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. సైన్యం, ఇంటో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బలగాలు.. కాలంతో పోటీ పడి పనిచేస్తున్నాయి.

U'khand disaster
సహాయక చర్యల్లో ఐటీబీపీ, ఎన్​డీఆర్​ఎఫ్​ష ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది
U'khand disaster
తపోవన్​ జలవిద్యుత్​ కేంద్రం వద్ద గాలింపు చర్యలు

టన్నెల్​ లోపల చిక్కుకున్న వారిని కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్లు, రిమోట్​ సెన్సింగ్​ పరికరాలను వాడుతున్నారు.

తపోవన్​ వద్ద చినూక్​ హెలికాప్టర్​తో గాలింపు చర్యలు నిర్వహించారు.

U'khand disaster
చినూక్​ హెలికాప్టర్​తో గాలింపు

ఐటీబీపీ, ఆర్మీ, స్థానిక యంత్రాంగం అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై... సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.

U'khand disaster
తదుపరి కార్యాచరణ కోసం అధికారుల సమీక్ష

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: వరదలో కొట్టుకుపోయిన కార్మికులు

రెండున్నర కిలోమీటర్ల పొడవున్న సొరంగం నుంచి బయటకు వస్తున్న బురద.. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పరుస్తోంది. భారీ యంత్రాల ద్వారా బురదను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించారు. లోపల ఉన్న వారి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలను పంపినా.. అంతా చీకటిగా ఉండటం వల్ల పెద్దగా ఫలితం లేదు. మరోవైపు.. సొరంగంలో చిక్కుకుపోయిన తమవారి రాక కోసం కుటుంబసభ్యులు వేచి చూస్తున్నారు.

U'khand disaster
టన్నెల్​ లోపల జోరుగా సహాయక చర్యలు

హెలికాప్టర్లతో నిత్యవసరాలు సరఫరా..

హిమనీనదం సృష్టించిన జలవిలయంతో పలు గ్రామాలకు.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అక్కడి ప్రజలకు.. ఐటీబీపీ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా నిత్యవసరాలు సరఫరా చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లి.. వారికి ఆహార పదార్థాలను అందిస్తున్నారు.

ఫిబ్రవరి 7న జలప్రళయం ధాటికి ఛమోలీ సహా చుట్టుపక్కల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విష్ణుప్రయాగ్​లోని పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోడలకు బీటలు వారాయి.

బాధితుల బంధువులు ఆందోళన..

రిషిగంగ ప్రాజెక్ట్​ వద్ద పనిచేసే సుమారు 40 మంది కార్మికుల కుటుంబసభ్యులు బుధవారం నిరసనకు దిగారు. అలకనందా నదీ వద్ద జలవిలయం అనంతరం.. సహాయక చర్యలు సక్రమంగా చేపట్టలేదని ఆరోపించారు. ప్రాజెక్ట్​ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

''విషాదం జరిగి 4 రోజులైంది. ముఖ్యంగా రహదారుల పునరుద్ధరణపైనే వారందరి దృష్టి నెలకొంది. తప్పిపోయిన కార్మికులను కాపాడాలన్న ఉద్దేశం కనిపించట్లేదు.''

- ఓ బాధితుడి సోదరుడు

ఇదీ చూడండి: ఉత్తరాఖండ్​ వరదలు: ఆ పరికరంపైనే 'అణు'మానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.