మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. పారాగ్లైడింగ్ చేస్తూ.. పడిపోయి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఖంద్వా జిల్లా హనువంతియాలో బుధవారం సాయంంత్రం ఈ ఘటన జరిగింది.
ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగులైన ఇద్దరు వ్యక్తులు పారాగ్లైడింగ్ చేస్తూ.. 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినట్లు మూందీ సబ్ ఇన్స్పెక్టర్ బీఎస్ మండ్లోయ్ తెలిపారు. వారిద్దరినీ మూందీలోని కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని చెప్పారు. మృతులను రాజస్థాన్ పాలి జిల్లా బుద్దా మంగ్లియాన్కు చెందిన గజ్పాల్ సింగ్(28), మధ్యప్రదేశ్లోని రాజ్గడ్లోని భగోరాకు చెందిన బల్చంద్ దంగి(32)గా గుర్తించారు.
ఈ ఘటనపై మెజీస్టీరియల్ దర్యాప్తు జరపాలని పునాసా సబ్డివిజనల్ మేజిస్ట్రేట్ను ఖంద్వా కలెక్టర్ ఆదేశించారు. వీరి మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి:12 ఏళ్ల బాలికపై బాలుడు అత్యాచార యత్నం