దిల్లీ ప్రహ్లాద్పూర్ ప్రాంతంలో ఇద్దరు నేరచరితులను ప్రత్యేక పోలీసు దళం ఎన్కౌంటర్ చేసింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోంది. మృతులు రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ ఇద్దరూ .. పలు కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇటీవల కరాల్ నగర్లో జరిగిన హత్య కేసులోనూ వీరి హస్తం ఉన్నట్లు గుర్తించారు.