ETV Bharat / bharat

దిల్లీ హింస: 550 ట్విట్టర్ ఖాతాలపై వేటు

author img

By

Published : Jan 28, 2021, 5:45 AM IST

ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింస నేపథ్యంలో దాదాపు 550 ఖాతాలను ట్విట్టర్ తొలగించింది. అసంబద్ధ సందేశాలతో ట్విట్టర్ వేదికను దుర్వినియోగపరచిన వినియోగదారులపై ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.

twitter-suspends-over-550-accounts-after-violence
దిల్లీ హింస: 550 ట్విట్టర్ ఖాతాలపై వేటు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో దాదాపు 550 ఖాతాలను ట్విట్టర్ తొలగించింది. బుధవారం ఈ విషయాన్ని ట్విట్టర్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.

రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం, తదనంతర పరిణామాలపై అసంబద్ధ సందేశాలతో ట్విట్టర్ వేదికను దుర్వినియోగపరచిన వినియోగదారులపై ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

"మేం గట్టి వైఖరినే తీసుకున్నాం. అసంబద్ధ సందేశాలు, విద్వేష ప్రసంగాలు, బెదిరింపులు ఉద్రిక్తతలను పెంచుతాయి. కాబట్టి, మా వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించినవారి ఖాతాలను తొలగించాం."

-ట్విట్టర్ ప్రతినిధి

ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంలోనూ ఇలాగే వ్యవహరించినట్టు ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు.

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో దాదాపు 550 ఖాతాలను ట్విట్టర్ తొలగించింది. బుధవారం ఈ విషయాన్ని ట్విట్టర్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.

రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం, తదనంతర పరిణామాలపై అసంబద్ధ సందేశాలతో ట్విట్టర్ వేదికను దుర్వినియోగపరచిన వినియోగదారులపై ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

"మేం గట్టి వైఖరినే తీసుకున్నాం. అసంబద్ధ సందేశాలు, విద్వేష ప్రసంగాలు, బెదిరింపులు ఉద్రిక్తతలను పెంచుతాయి. కాబట్టి, మా వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించినవారి ఖాతాలను తొలగించాం."

-ట్విట్టర్ ప్రతినిధి

ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంలోనూ ఇలాగే వ్యవహరించినట్టు ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.