ETV Bharat / bharat

ట్రంప్-మోదీ ప్రారంభించే మోటేరా స్టేడియం విశేషాలివే...

author img

By

Published : Feb 13, 2020, 2:59 PM IST

Updated : Mar 1, 2020, 5:26 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత పర్యటనకు రానున్నారు. ఇందులో భాగంగా అహ్మదాబాద్​లో భారీ క్రికెట్ స్టేడియంను ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డుల్లోకెక్కనుంది. లక్షా 10 వేల మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ స్టేడియం గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం...

motera  stadium
మోటేరా స్టేడియం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్​లో నిర్మించిన భారీ స్టేడియంను భారత ప్రధానమంత్రి మోదీ, ట్రంప్​ కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఇరువురు దేశాధినేతలు స్టేడియంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంపై అందరి దృష్టి నెలకొంది.

ప్రారంభం అనంతరం ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డుల్లోకెక్కనుంది. ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంగా పిలుస్తున్న ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్ క్రికెట్ స్టేడియం రెండో స్థానానికి పడిపోనుంది. మెల్​బోర్న్​ స్టేడియం సామర్థ్యం 1,00,024 కాగా... లక్షా పది వేల సామర్థ్యంతో మోటేరా స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ స్టేడియం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ స్టేడియాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షించనుంది.

మోటేరా స్టేడియం నమూనా దృశ్యాలు

దిగ్గజాల రికార్డుల నిలయం

ఈ ప్రాంతంలో ఇదివరకే క్రికెట్ స్టేడియం ఉండేది. ఇక్కడ ఉన్న పాత మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. ఆ మైదానంలో 49వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించే వీలుండేది. 1983లో ఈ మైదానంలో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరిగింది. మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ ఈ స్టేడియంలోనే... టెస్టు‌ క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఇదే మైదానంలో తన టెస్ట్‌ కెరీర్‌లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు.

2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఆ తర్వాత స్టేడియంను మూసివేసి విస్తరణ పనులు చేపట్టారు. 2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 1,10,000 మంది కూర్చునేలా స్టేడియంను నిర్మిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్​లో నిర్మించిన భారీ స్టేడియంను భారత ప్రధానమంత్రి మోదీ, ట్రంప్​ కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఇరువురు దేశాధినేతలు స్టేడియంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంపై అందరి దృష్టి నెలకొంది.

ప్రారంభం అనంతరం ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డుల్లోకెక్కనుంది. ఇప్పటివరకు ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంగా పిలుస్తున్న ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్ క్రికెట్ స్టేడియం రెండో స్థానానికి పడిపోనుంది. మెల్​బోర్న్​ స్టేడియం సామర్థ్యం 1,00,024 కాగా... లక్షా పది వేల సామర్థ్యంతో మోటేరా స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ స్టేడియం నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ స్టేడియాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షించనుంది.

మోటేరా స్టేడియం నమూనా దృశ్యాలు

దిగ్గజాల రికార్డుల నిలయం

ఈ ప్రాంతంలో ఇదివరకే క్రికెట్ స్టేడియం ఉండేది. ఇక్కడ ఉన్న పాత మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. ఆ మైదానంలో 49వేల మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించే వీలుండేది. 1983లో ఈ మైదానంలో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరిగింది. మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ ఈ స్టేడియంలోనే... టెస్టు‌ క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఇదే మైదానంలో తన టెస్ట్‌ కెరీర్‌లో తొలి ద్విశతకాన్ని నమోదు చేశాడు.

2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఆ తర్వాత స్టేడియంను మూసివేసి విస్తరణ పనులు చేపట్టారు. 2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 1,10,000 మంది కూర్చునేలా స్టేడియంను నిర్మిస్తున్నారు.

Last Updated : Mar 1, 2020, 5:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.