ETV Bharat / bharat

సీబీఐ చేతికి తండ్రి, కొడుకుల లాకప్​డెత్ కేసు

author img

By

Published : Jun 28, 2020, 5:34 PM IST

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళనాడు తండ్రి, కొడుకుల లాకప్​డెత్​ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టుకు నివేదిస్తామని వెల్లడించింది.

tn govt cbi
సీబీఐ చేతికి తండ్రి కొడుకుల లాకప్​డెత్ కేసు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు ట్యూరికొరిన్ చెందిన తండ్రి, కొడుకుల లాకప్​ డెత్​కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టుకు తెలుపుతామని చెప్పారు. కేసును సీబీఐకి బదిలీ చేసేముందు కోర్టు అనుమతి తీసుకుంటామని స్పష్టం చేశారు.

లాక్​డౌన్ నిబంధనలను అతిక్రమించి.. వారి సెల్​ఫోన్ దుకాణాన్ని తెరిచినందుకు పి. జయరాజ్, ఫెనిక్స్​లను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. అనంతరం వారు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై కారణమైన ఇద్దరు ఎస్​ఐలను, నలుగురు పోలీసు సిబ్బందిని ఇప్పటికే సస్పెండ్ చేశారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు ట్యూరికొరిన్ చెందిన తండ్రి, కొడుకుల లాకప్​ డెత్​కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టుకు తెలుపుతామని చెప్పారు. కేసును సీబీఐకి బదిలీ చేసేముందు కోర్టు అనుమతి తీసుకుంటామని స్పష్టం చేశారు.

లాక్​డౌన్ నిబంధనలను అతిక్రమించి.. వారి సెల్​ఫోన్ దుకాణాన్ని తెరిచినందుకు పి. జయరాజ్, ఫెనిక్స్​లను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. అనంతరం వారు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై కారణమైన ఇద్దరు ఎస్​ఐలను, నలుగురు పోలీసు సిబ్బందిని ఇప్పటికే సస్పెండ్ చేశారు.

ఇదీ చూడండి: 'అక్కడ జార్జి ఫ్లాయిడ్.. ఇక్కడ జయరాజ్​-ఫెనిక్స్​'

జయరాజ్​, ఫెనిక్స్: పోలీసుల క్రూరత్వంపై సెలబ్రిటీల ఫైర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.