ETV Bharat / bharat

'జూ'లో పులి మృతి.. కరోనా టెస్టుకు శాంపిల్స్‌!

author img

By

Published : Apr 24, 2020, 10:53 PM IST

దిల్లీలోని జంతు ప్రదర్శనశాలలో ఓ పులి కిడ్నీ ఫెయిల్ కావడం వల్ల మరణించింది. పులి నమూనాలను పరీక్షలకు పంపించారు అధికారులు. టెస్టులో కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు.

tigress-dies-of-kidney-failure-in-delhi-zoo-samples-sent-for-coronavirus-testing
జూలో పులి మృతి..కరోనా టెస్టుకు శాంపిల్స్‌

దేశ రాజధాని దిల్లీలోని జంతు ప్రదర్శనశాలలో ఓ ఆడ పులి కిడ్నీ ఫెయిలై మరణించింది. జంతువులకూ కరోనా వచ్చే ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దాని నమూనాలను కరోనా పరీక్షలకు పంపించారు జూ అధికారులు.

ఫలితం నెగిటివ్

కల్పన అనే 14 ఏళ్ల ఆడ పులి బుధవారం మరణించింది. అధికారుల సమక్షంలో గురువారం ఖననం చేశారు. క్రియాటినిన్‌ స్థాయిలు పెరగడం (కిడ్నీ ఫెయిల్‌ అయినప్పుడు జరుగుతుంది) వల్లే మరణించిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అనంతరం పులికి సంబంధించిన నమూనాలను యూపీ బరేలీలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు జూ అధికారులు వెల్లడించారు.

అప్రమత్తం

అమెరికాలోని జూలో ఓ పులికి కేర్‌ టేకర్‌ ద్వారా కరోనా వ్యాపించిన నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. మనుషుల నుంచి జంతువులకు కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అనుమానముంటే ప్రతి 15 రోజులకోసారి నమూనాలను సేకకరించాలని సెంట్రల్‌ జూ అథారిటీ అన్ని జంతు ప్రదర్శశాలలకు సూచించింది. ఈ నేపథ్యంలో పులి మరణించడం వల్ల దానికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది.

ఇదీ చదవండి: అమెరికాలో భారత సంతతి వైద్యురాలికి అరుదైన గౌరవం

దేశ రాజధాని దిల్లీలోని జంతు ప్రదర్శనశాలలో ఓ ఆడ పులి కిడ్నీ ఫెయిలై మరణించింది. జంతువులకూ కరోనా వచ్చే ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దాని నమూనాలను కరోనా పరీక్షలకు పంపించారు జూ అధికారులు.

ఫలితం నెగిటివ్

కల్పన అనే 14 ఏళ్ల ఆడ పులి బుధవారం మరణించింది. అధికారుల సమక్షంలో గురువారం ఖననం చేశారు. క్రియాటినిన్‌ స్థాయిలు పెరగడం (కిడ్నీ ఫెయిల్‌ అయినప్పుడు జరుగుతుంది) వల్లే మరణించిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అనంతరం పులికి సంబంధించిన నమూనాలను యూపీ బరేలీలోని ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు జూ అధికారులు వెల్లడించారు.

అప్రమత్తం

అమెరికాలోని జూలో ఓ పులికి కేర్‌ టేకర్‌ ద్వారా కరోనా వ్యాపించిన నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. మనుషుల నుంచి జంతువులకు కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అనుమానముంటే ప్రతి 15 రోజులకోసారి నమూనాలను సేకకరించాలని సెంట్రల్‌ జూ అథారిటీ అన్ని జంతు ప్రదర్శశాలలకు సూచించింది. ఈ నేపథ్యంలో పులి మరణించడం వల్ల దానికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది.

ఇదీ చదవండి: అమెరికాలో భారత సంతతి వైద్యురాలికి అరుదైన గౌరవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.