మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు దిల్లీ లోధి శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో దివంగత నేతకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
దిల్లీ 10 రాజాజీ మార్గ్లోని ఆయన నివాసం నుంచి లోధి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగింది.
అంతకుముందు ప్రణబ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.
ఇదీ చూడండి: ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖుల నివాళులు