అల్లుణ్ని చంపాలంటూ ముఠాకు సుపారీ ఇచ్చిన ఓ జంట..వారి చేతిలోనే దోపిడికి గురై చివరకు కటకటాల పాలైన ఘటన కర్ణాటకలో జరిగింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది.
కులాంతర వివాహం..
మాండ్యకు చెందిన వెంకటేశ్, పుట్టతాయమ్మ దంపతుల కుమార్తె కులాంతర వివాహం చేసుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తిని అల్లుడిగా అంగీకరించలేని వెంకటేశ్ దంపతులు.. బెంగళూరుకు చెందిన మహదేవ, కుమార, లోకేశ్, మోహన్లకు తమ కుమార్తె భర్తను చంపాలని సుపారీ ఇచ్చారు. ఇందుకోసం సగం డబ్బును ముందస్తుగా ముట్టజెప్పారు.
పోలీసుల అదుపులో..
అయితే ముఠా సభ్యులు పూర్తి డబ్బు ఇవ్వాలంటూ బెదిరించడం సహా వారినే దోచుకున్నారు. అనంతరం.. ఆ ముఠా పోలీసులకు దొరికిపోయింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సుపారీ వ్యవహారం తెలిసింది. ఫలితంగా అల్లుడ్ని చంపడానికి యత్నించిన వెంకటేశ్ దంపతులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: ట్యాంకర్లతో లవ్ షేప్.. ప్రేయసికి సైనికాధికారి ప్రపోజ్