ETV Bharat / bharat

పాక్ ఉగ్ర శిబిరాల్లో 200 మంది కశ్మీరీలు? - terrorist training to pak visa holding kashmiris

పాకిస్థాన్ వీసాలు పొందిన 200 మంది కశ్మీరీ యువత జాడ తెలియడం లేదని నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిని ఉగ్రవాద శిబిరాల్లో రిక్రూట్ చేసుకుని శిక్షణ ఇస్తున్నట్లు నిఘా విభాగం అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్​లో సమస్యలు సృష్టించేలా వీరిని సన్నద్ధం చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

pak
పాక్ ఉగ్ర శిబిరాల్లో 2వందలమంది కశ్మీరీలు?
author img

By

Published : Jun 26, 2020, 9:33 PM IST

పాకిస్థాన్‌ వీసాలు పొందిన 200మందికి పైగా జమ్ముకశ్మీర్‌కు చెందిన యువత ఆచూకీ కోల్పోయిన నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. వారిని ఉగ్రవాద శిబిరాల్లోకి రిక్రూట్‌ చేసుకొని కశ్మీర్లో సమస్యలు సృష్టించేలా పాకిస్థాన్ శిక్షణ ఇచ్చే అవకాశం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

స్థానికులతోనే సమస్యలు సృష్టించేలా..

పాకిస్థాన్‌ హైకమిషన్‌ 2017 జనవరి నుంచి 399 మంది యువతకు పాకిస్థాన్‌ వీసాలు ఇచ్చింది. వారిలో కశ్మీర్‌కు చెందిన 218 మంది జాడ తెలియడం లేదు. కశ్మీరీ యువతను పాకిస్థాన్‌ లక్ష్యంగా ఎంచుకుంది. 2019, ఫిబ్రవరిలో పుల్వామా దాడి తర్వాత యువతకు శిక్షణ ఇచ్చి రాష్ట్రంలో ఉగ్రదాడులు చేపట్టాలన్నది పాక్‌ పన్నాగం’ అని ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంటున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అమాయక యువత.. పాక్​కు తిరుగుబాటు యోధులు

ఉగ్రవాద శిక్షణ పొందిన వాళ్లను పాకిస్థాన్‌ 'స్థానిక తిరుగుబాటు యోధులు'గా గుర్తిస్తోంది. కొన్ని నెలలుగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబడేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొడుతోంది. కొన్ని రోజుల క్రితమే జమ్ములో నక్కిన ఉగ్రవాదులను సైన్యం ఏరిపారేసింది.

ఇదీ చూడండి: చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం వేగవంతం

పాకిస్థాన్‌ వీసాలు పొందిన 200మందికి పైగా జమ్ముకశ్మీర్‌కు చెందిన యువత ఆచూకీ కోల్పోయిన నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. వారిని ఉగ్రవాద శిబిరాల్లోకి రిక్రూట్‌ చేసుకొని కశ్మీర్లో సమస్యలు సృష్టించేలా పాకిస్థాన్ శిక్షణ ఇచ్చే అవకాశం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

స్థానికులతోనే సమస్యలు సృష్టించేలా..

పాకిస్థాన్‌ హైకమిషన్‌ 2017 జనవరి నుంచి 399 మంది యువతకు పాకిస్థాన్‌ వీసాలు ఇచ్చింది. వారిలో కశ్మీర్‌కు చెందిన 218 మంది జాడ తెలియడం లేదు. కశ్మీరీ యువతను పాకిస్థాన్‌ లక్ష్యంగా ఎంచుకుంది. 2019, ఫిబ్రవరిలో పుల్వామా దాడి తర్వాత యువతకు శిక్షణ ఇచ్చి రాష్ట్రంలో ఉగ్రదాడులు చేపట్టాలన్నది పాక్‌ పన్నాగం’ అని ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంటున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అమాయక యువత.. పాక్​కు తిరుగుబాటు యోధులు

ఉగ్రవాద శిక్షణ పొందిన వాళ్లను పాకిస్థాన్‌ 'స్థానిక తిరుగుబాటు యోధులు'గా గుర్తిస్తోంది. కొన్ని నెలలుగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబడేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొడుతోంది. కొన్ని రోజుల క్రితమే జమ్ములో నక్కిన ఉగ్రవాదులను సైన్యం ఏరిపారేసింది.

ఇదీ చూడండి: చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం వేగవంతం

For All Latest Updates

TAGGED:

PAK VISAS
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.