ETV Bharat / bharat

కర్తార్​పుర్ నడవాపై నేడు భారత్​-పాక్​ సమావేశం

కర్తార్​పుర్ నడవా ప్రారంభానికి సంబంధించి సాంకేతిక సమావేశాన్ని నేడు నిర్వహిస్తున్నట్లు పాకిస్థాన్ తెలిపింది. భారత అధికారులు ఈ భేటీకి అంగీకరించినట్లు వెల్లడించింది.

author img

By

Published : Aug 30, 2019, 8:29 AM IST

Updated : Sep 28, 2019, 8:04 PM IST

కర్తార్​పుర్ నడవాపై నేడు భారత్​-పాక్​ సమావేశం

కర్తార్​పుర్​ నడవాపై సాంకేతిక సమావేశం నిర్వహించాలన్న పాకిస్థాన్ ప్రతిపాదనకు భారత్​ అంగీకారం తెలిపినట్లు ఆ దేశ విదేశీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు. నేడు జరగనున్న ఈ భేటీలో ఇరుదేశాల ప్రతినిధులు పాల్గొంటారని స్పష్టం చేశారు.

పంజాబ్​ సరిహద్దు వెంబడి నిర్మిస్తోన్న కర్తార్​పుర్ నడవా (4.7 కిలోమీటర్లు) ఇరుదేశాలలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతుంది. సిక్కు గురువు గురునానక్​ దేవ్​ 550 జయంతి (2019 నవంబర్​) లోగా ఈ నడవా పూర్తి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.

భారత్​ పంజాబ్​లోని సిక్కు పవిత్ర క్షేత్రం 'డేరా బాబా నానక్​ సాహెబ్'​, అలాగే పాకిస్థాన్​ పంజాబ్​లోని 'గురుద్వారా దర్బార్​ సాహిబ్​ కర్తార్​పుర్​' లను ఈ నడవా కలుపుతుంది. ఫలితంగా ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర క్షేత్రాలను వీసా లేకుండా దర్శించడానికి మార్గం సుగమమవుతుంది.శ్రమ తగ్గుతుంది.

ప్రస్తుతం భారత సిక్కులు బస్సులో లాహోర్ చేరుకుని అక్కడ నుంచి కర్తార్​పుర్​లోని పవిత్ర సిక్కు క్షేత్రానికి చేరుకుంటున్నారు. అంటే సుమారు 125 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. నిజానికి కేవలం 4.7 కిలోమీటర్ల దూరంలోని ఆ పవిత్ర దేవాలయాన్ని భారత దేశం నుంచి బైనాక్యులర్ ఉపయోగించి చూడవచ్చు. నడవా పూర్తయితే ఈ సమస్య తీరి ఇరుదేశాల భక్తులు పరస్పరం తమ పవిత్ర దేవాలయాలను సులభంగా దర్శించుకోవచ్చు.

ఇదీ చూడండి: సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం

కర్తార్​పుర్​ నడవాపై సాంకేతిక సమావేశం నిర్వహించాలన్న పాకిస్థాన్ ప్రతిపాదనకు భారత్​ అంగీకారం తెలిపినట్లు ఆ దేశ విదేశీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు. నేడు జరగనున్న ఈ భేటీలో ఇరుదేశాల ప్రతినిధులు పాల్గొంటారని స్పష్టం చేశారు.

పంజాబ్​ సరిహద్దు వెంబడి నిర్మిస్తోన్న కర్తార్​పుర్ నడవా (4.7 కిలోమీటర్లు) ఇరుదేశాలలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతుంది. సిక్కు గురువు గురునానక్​ దేవ్​ 550 జయంతి (2019 నవంబర్​) లోగా ఈ నడవా పూర్తి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.

భారత్​ పంజాబ్​లోని సిక్కు పవిత్ర క్షేత్రం 'డేరా బాబా నానక్​ సాహెబ్'​, అలాగే పాకిస్థాన్​ పంజాబ్​లోని 'గురుద్వారా దర్బార్​ సాహిబ్​ కర్తార్​పుర్​' లను ఈ నడవా కలుపుతుంది. ఫలితంగా ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర క్షేత్రాలను వీసా లేకుండా దర్శించడానికి మార్గం సుగమమవుతుంది.శ్రమ తగ్గుతుంది.

ప్రస్తుతం భారత సిక్కులు బస్సులో లాహోర్ చేరుకుని అక్కడ నుంచి కర్తార్​పుర్​లోని పవిత్ర సిక్కు క్షేత్రానికి చేరుకుంటున్నారు. అంటే సుమారు 125 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. నిజానికి కేవలం 4.7 కిలోమీటర్ల దూరంలోని ఆ పవిత్ర దేవాలయాన్ని భారత దేశం నుంచి బైనాక్యులర్ ఉపయోగించి చూడవచ్చు. నడవా పూర్తయితే ఈ సమస్య తీరి ఇరుదేశాల భక్తులు పరస్పరం తమ పవిత్ర దేవాలయాలను సులభంగా దర్శించుకోవచ్చు.

ఇదీ చూడండి: సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం

AP Video Delivery Log - 0200 GMT News
Friday, 30 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0112: US NY Foie Gras Ban AP Clients Only 4227366
Farms worry as NYC considers foie gras ban
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.