ETV Bharat / bharat

'చైనాతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి'

author img

By

Published : Jun 8, 2020, 8:03 PM IST

సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. సమస్య పరిష్కరించుకోవడానికి చర్చలు కొనసాగించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని పేర్కొన్నారు.

Talks with China positive, will continue: Rajnath Singh
'ఆ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి'

చైనాతో మిలిటరీ, దౌత్య స్థాయిలో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వెల్లడించారు. చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మహారాష్ట్ర భాజపా జన్​-సం​వాద్​ ర్యాలీనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చేసిన ప్రసంగంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"చైనాతో మిలిటరీ, దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 6న చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రస్తుత వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకరించాయి."

- రాజ్​నాథ్​ సింగ్​, భారత రక్షణమంత్రి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశ కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లనివ్వదని పునరుద్ఘాటించారు రాజ్​నాథ్​. భారత్​-చైనా సరిహద్దు వివాదం గత కొంత కాలంగా సాగుతోందని.. దానిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భారత్​ కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

భారత్​-చైనా సరిహద్దు వద్ద పరిస్థితులపై స్పష్టతనివ్వాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు కోరినట్టు గుర్తు చేసిన రాజ్​నాథ్​.. వారందరికీ పార్లమెంట్​లోనే సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. దేశ ప్రజలను తప్పుదోవపట్టించనని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- భారత్​తో సరిహద్దు రగడపై చైనా శాంతి మంత్రం!

చైనాతో మిలిటరీ, దౌత్య స్థాయిలో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వెల్లడించారు. చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మహారాష్ట్ర భాజపా జన్​-సం​వాద్​ ర్యాలీనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చేసిన ప్రసంగంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"చైనాతో మిలిటరీ, దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 6న చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రస్తుత వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకరించాయి."

- రాజ్​నాథ్​ సింగ్​, భారత రక్షణమంత్రి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశ కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లనివ్వదని పునరుద్ఘాటించారు రాజ్​నాథ్​. భారత్​-చైనా సరిహద్దు వివాదం గత కొంత కాలంగా సాగుతోందని.. దానిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భారత్​ కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

భారత్​-చైనా సరిహద్దు వద్ద పరిస్థితులపై స్పష్టతనివ్వాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు కోరినట్టు గుర్తు చేసిన రాజ్​నాథ్​.. వారందరికీ పార్లమెంట్​లోనే సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. దేశ ప్రజలను తప్పుదోవపట్టించనని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- భారత్​తో సరిహద్దు రగడపై చైనా శాంతి మంత్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.