ETV Bharat / bharat

'కపిల్ మిశ్రాపై ఎఫ్​ఐఆర్​ నమోదును పరిశీలించండి'

author img

By

Published : Feb 26, 2020, 6:26 PM IST

Updated : Mar 2, 2020, 4:02 PM IST

భాజపా నేతలు కపిల్ మిశ్రా సహా మరో ఇద్దరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసే అంశాన్ని పరిశీలించాలని పోలీసులను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. రాజధానిలో చెలరేగుతున్న హింసకు ఆ ముగ్గును భాజపా నాయకులు చేసిన ప్రసంగాలే కారణమని దాఖలైన పిటిషన్​ను విచారించింది కోర్టు. ఎఫ్ఐఆర్​​ నమోదుపై గురువారం కోర్టుకు నివేదిక సమర్పించాలని సూచించింది.

caa
'కపిల్ మిశ్రాపై ఎఫ్​ఐఆర్​ నమోదును పరిశీలించండి'

దిల్లీలో ఘర్షణలకు భాజపా నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ ప్రసంగాలు కారణమని దాఖలైన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు విచారించింది. అన్ని కోణాల్లో సునిశితంగా పరిశీలించి భాజపా నేతలపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసే అంశమై నిర్ణయం తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

ప్రత్యేక కమిషనర్​కు ఆదేశాలు

పోలీసు కమిషనర్​ను సంప్రదించి విద్వేషపూరిత వ్యాఖ్యలను నిజనిర్ధరణ చేసుకుని తుది నిర్ణయానికి రావాలని ప్రత్యేక కమిషనర్ ప్రవీర్ రంజన్​ను ఆదేశించింది హైకోర్టు. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని వీడియోలను పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది.

పౌర వ్యతిరేక ఆందోళనలకు సంబంధించి కేంద్రం దాఖలు చేసిన మరో పిటిషన్​ను విచారించింది కోర్టు. కేంద్రం వ్యాజ్యం ఆధారంగా ఆయా వర్గాలకు నోటీసులు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణను గురువారం చేపట్టనుంది.

ఇదీ చూడండి: గ్రౌండ్​ జీరోలో డోభాల్​- స్థానికుల్లో భరోసా నింపే యత్నం

దిల్లీలో ఘర్షణలకు భాజపా నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ ప్రసంగాలు కారణమని దాఖలైన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు విచారించింది. అన్ని కోణాల్లో సునిశితంగా పరిశీలించి భాజపా నేతలపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసే అంశమై నిర్ణయం తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

ప్రత్యేక కమిషనర్​కు ఆదేశాలు

పోలీసు కమిషనర్​ను సంప్రదించి విద్వేషపూరిత వ్యాఖ్యలను నిజనిర్ధరణ చేసుకుని తుది నిర్ణయానికి రావాలని ప్రత్యేక కమిషనర్ ప్రవీర్ రంజన్​ను ఆదేశించింది హైకోర్టు. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని వీడియోలను పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది.

పౌర వ్యతిరేక ఆందోళనలకు సంబంధించి కేంద్రం దాఖలు చేసిన మరో పిటిషన్​ను విచారించింది కోర్టు. కేంద్రం వ్యాజ్యం ఆధారంగా ఆయా వర్గాలకు నోటీసులు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణను గురువారం చేపట్టనుంది.

ఇదీ చూడండి: గ్రౌండ్​ జీరోలో డోభాల్​- స్థానికుల్లో భరోసా నింపే యత్నం

Last Updated : Mar 2, 2020, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.