హరియాణా గురుగ్రామ్లోకి ప్రవేశించిన మిడతల దండు దిల్లీ, ఉత్తర్ప్రదేశ్లోనూ పంటలను నాశనం చేసేందుకు సరిహద్దుల్లోకి దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు, అధికారులు అప్రమత్తమయ్యారు.
శనివారం ఉదయం 11.30 సమయంలో సెక్టార్-5, గురుగ్రామ్-మోహిందర్ఘర్, ద్వారకా ఎక్స్ప్రెస్ వే వెంట పెద్ద ఎత్తున మిడతల సమూహం కనిపించింది. మోహిందర్ఘర్ ప్రాంతంలోని ప్రజలను కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని హెచ్చరించారు స్థానిక అధికారులు. గిన్నెలతో శబ్ధాలు చేసి మిడతలను తరమేయాలని కోరారు. ఫలితంగా రైతులు హుటాహుటిన పొలాల వద్దకు వెళ్లి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
![Swarms of crop-destroying desert locusts reach Haryana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:03:47:1593250427_t5yt65y_0206newsroom_1591107806_456.jpg)
సంప్రదాయ పద్ధతుల్లో పొగ పెట్టి.. పంటలపై మిడతలు వాలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, హెచ్చరికలు జారీ చేయడం తప్ప అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మరోవైపు.. మిడతలు విశ్రాంతి తీసుకునే సమయంలో వాటిపై రసాయనాలను పిచికారీ చేయగలమన్నారు హరియాణాకు చెందిన ఓ వ్యవసాయాధికారి.
దిల్లీ అప్రమత్తం..
హరియాణాలోకి దండెత్తిన మిడతలు ఇప్పటికే దిల్లీ సరిహద్దులోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాజ్. ఈ కీటకాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
![Swarms of crop-destroying desert locusts reach Haryana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7794321_886_7794321_1593255337541.png)
ఉత్తర్ ప్రదేశ్లోనూ ఓ దండు..