ETV Bharat / bharat

డిగ్రీ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదు!

డిగ్రీ పరీక్షలు రద్దు చేసే హక్కు రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది యూజీసీ. ఈ సెప్టెంబర్ ఆఖరుకల్లా పరీక్షలు నిర్వహించాలని, ఏమైనా మార్పులుంటే యూజీసీ స్వయంగా ప్రకటిస్తుందని తెలిపింది.

author img

By

Published : Aug 10, 2020, 2:24 PM IST

states-cant-cancel-exams-degrees-wont-be-recognised-ugc-tells-sc
డిగ్రీ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదు!

రాష్ట్రాలకు డిగ్రీ పరీక్షలు రద్దు చేసే హక్కు లేదని.. ఒకవేళ అలా చేస్తే డిగ్రీ చెల్లదని తెగేసి చెప్పింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ). దిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు డిగ్రీ పరీక్షలు రద్దు చేయడంపై తీవ్రంగా స్పందించింది.

డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలంటూ సెప్టెంబర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పరిశీలిస్తున్న వేళ.. రాష్ట్రాలు యూజీసీ నియమాలను మార్చకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు కోరుకోవట్లేదన్నారు. పరీక్షల నియమ, నిబంధనలు మార్చే హక్కు యూజీసీకి మాత్రమే ఉందని, రాష్ట్రాలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం... విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

జులై 6న పరీక్షలకు సంబంధించి యూజీసీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్ నెల లోపు... పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగావకాశాలు పరీక్షలతో ముడిపడి ఉన్నాయని ఆనాడే తెలిపింది.

ఇదీ చదవండి: భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే మ్యూజియం!

రాష్ట్రాలకు డిగ్రీ పరీక్షలు రద్దు చేసే హక్కు లేదని.. ఒకవేళ అలా చేస్తే డిగ్రీ చెల్లదని తెగేసి చెప్పింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ). దిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు డిగ్రీ పరీక్షలు రద్దు చేయడంపై తీవ్రంగా స్పందించింది.

డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలంటూ సెప్టెంబర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పరిశీలిస్తున్న వేళ.. రాష్ట్రాలు యూజీసీ నియమాలను మార్చకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు కోరుకోవట్లేదన్నారు. పరీక్షల నియమ, నిబంధనలు మార్చే హక్కు యూజీసీకి మాత్రమే ఉందని, రాష్ట్రాలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం... విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

జులై 6న పరీక్షలకు సంబంధించి యూజీసీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్ నెల లోపు... పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగావకాశాలు పరీక్షలతో ముడిపడి ఉన్నాయని ఆనాడే తెలిపింది.

ఇదీ చదవండి: భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే మ్యూజియం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.