ETV Bharat / bharat

'మహా'లో ఆగని వైరస్​ ఉద్ధృతి-అక్టోబర్​ 31వరకు లాక్​డౌన్​

author img

By

Published : Sep 30, 2020, 8:46 PM IST

Updated : Sep 30, 2020, 10:34 PM IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేరళలో రికార్డు స్థాయిలో 8,830 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో వైరస్​ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. అక్టోబర్​ 31వరకు లాక్​డౌన్​ పొడిగించింది ఉద్ధవ్​ ఠాక్రే ప్రభుత్వం. తమిళనాడు, కర్ణాటక, సహా పలు రాష్ట్రాల్లో వైరస్​ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

State wise COVID-19 cases in India
కరోనా కేసుల్లో కేరళ రికార్డు- ​ఒక్కరోజే 8,830 కేసులు

భారత్​లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. మహాలో కొత్తగా 18,317మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మరో 481 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 84 వేలు దాటింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 31 వరకు లాక్​డౌన్​ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు అక్టోబరు 5 నుంచి... 50 శాతం సామర్థ్యంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.

కేరళలో రికార్డు..

కేరళలో రికార్డు స్థాయిలో 8,830 కేసులు నమోదయ్యాయి. మరో 23మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య లక్షా 28 వేలు దాటింది.

  • తమిళనాడులో కొత్తగా 5,659 మంది వైరస్ బారిన పడగా.. మరో 67 మంది చనిపోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 5 లక్షల 97వేలు దాటింది.
  • దిల్లీలో తాజాగా 3,390మందికి వైరస్ సోకింది. 41మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 79వేల 715కు చేరింది.
  • రాజస్థాన్​లో ఒక్కరోజే 2,173 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 15 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య లక్షా 35వేలు దాటింది.

మెట్రో రైలు సిబ్బంది కరోనా

కర్ణాటకలోని బెంగళూరు మెట్రో రైలు సిబ్బందికి కరోనా సోకింది. సెప్టెంబర్​ 7న మెట్రో రైలు సేవలు పునః ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 28 మంది వైరస్ బారినపడ్డారు.

ఇదీ చూడండి: ఇంటి వద్దకే విద్య: గోడలనే బ్లాక్​బోర్డులుగా మలిచి.!

భారత్​లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. మహాలో కొత్తగా 18,317మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మరో 481 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 84 వేలు దాటింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 31 వరకు లాక్​డౌన్​ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు అక్టోబరు 5 నుంచి... 50 శాతం సామర్థ్యంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.

కేరళలో రికార్డు..

కేరళలో రికార్డు స్థాయిలో 8,830 కేసులు నమోదయ్యాయి. మరో 23మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య లక్షా 28 వేలు దాటింది.

  • తమిళనాడులో కొత్తగా 5,659 మంది వైరస్ బారిన పడగా.. మరో 67 మంది చనిపోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 5 లక్షల 97వేలు దాటింది.
  • దిల్లీలో తాజాగా 3,390మందికి వైరస్ సోకింది. 41మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 79వేల 715కు చేరింది.
  • రాజస్థాన్​లో ఒక్కరోజే 2,173 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 15 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య లక్షా 35వేలు దాటింది.

మెట్రో రైలు సిబ్బంది కరోనా

కర్ణాటకలోని బెంగళూరు మెట్రో రైలు సిబ్బందికి కరోనా సోకింది. సెప్టెంబర్​ 7న మెట్రో రైలు సేవలు పునః ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 28 మంది వైరస్ బారినపడ్డారు.

ఇదీ చూడండి: ఇంటి వద్దకే విద్య: గోడలనే బ్లాక్​బోర్డులుగా మలిచి.!

Last Updated : Sep 30, 2020, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.