ETV Bharat / bharat

భారత్ దెబ్బను చైనా ఊహించలేదు: రావత్​

author img

By

Published : Nov 6, 2020, 12:22 PM IST

తూర్పు లద్దాఖ్​లో దుశ్చర్యలకు పాల్పడిన చైనాకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిన తర్వాత ఆ దేశం ఊహించని పరిణామాలు ఎదుర్కొంటోందని సీడీఎస్​ జరనల్ బిపిన్ రావత్ తెలిపారు​. సరిహద్దులో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే ఉన్నట్లు పేర్కొన్నారు. కశ్మీర్లో​ నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్​కు పరోక్షహెచ్చరికలు చేశారు.

Situation along Line of Actual Control in eastern Ladakh remains tense: Chief of Defence Staff Gen Bipin Rawat.
భారత్ దెబ్బను చైనా ఊహించలేదు: రావత్​

తూర్పు లద్దాఖ్​లో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. చైనా దుశ్చర్యలకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిన తర్వాత ఆ దేశానికి ఏం చేయాలో తెలియడం లేదని చెప్పారు. సరిహద్దులో పూర్వ స్థితిని మార్చాలని చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. సరిహద్దు ఘర్షణలు అతిపెద్ద సైనిక చర్యలకు దారితీసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఓ వర్చువల్ సెమినార్​లో ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు.

నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్థాన్​కు రావత్​ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భారత వ్యతిరేక శక్తులకు వత్తాసు పలుకుతూ జమ్ముకశ్మీర్​లో యుద్ధవాతావరణం సృష్టించాలని చూస్తున్నందుకే పాకిస్థాన్​తో సంబంధాలు అట్టడుగుకు చేరాయన్నారు. భారత్​ నిర్వహించిన లక్షిత దాడులు, బాలాకోట్ దాడులు ఉగ్రవాదులను ఉసిగొల్పాలని చూస్తున్న పాకిస్థాన్​కు గట్టి సందేశమని రావత్​ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్న నూతన పంథాతో పాక్​లో అనిశ్చితి నెలకొందని తెలిపారు.

భారత్​ ఎదిగే కొద్దీ భద్రతా సవాళ్లు ఎదురవుతాయని, అందుకే సైనిక అవసరాలకు ఇతర దేశాలపై ఆధార పడకుండా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని రావత్​ పేర్కొన్నారు. అణ్వాయుధాలు గల రెండు పొరుగు దేశాలు(చైనా, పాక్) వ్యూహాత్మక ప్రాంతీయ అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు.

తూర్పు లద్దాఖ్​లో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. చైనా దుశ్చర్యలకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిన తర్వాత ఆ దేశానికి ఏం చేయాలో తెలియడం లేదని చెప్పారు. సరిహద్దులో పూర్వ స్థితిని మార్చాలని చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. సరిహద్దు ఘర్షణలు అతిపెద్ద సైనిక చర్యలకు దారితీసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఓ వర్చువల్ సెమినార్​లో ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు.

నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్థాన్​కు రావత్​ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భారత వ్యతిరేక శక్తులకు వత్తాసు పలుకుతూ జమ్ముకశ్మీర్​లో యుద్ధవాతావరణం సృష్టించాలని చూస్తున్నందుకే పాకిస్థాన్​తో సంబంధాలు అట్టడుగుకు చేరాయన్నారు. భారత్​ నిర్వహించిన లక్షిత దాడులు, బాలాకోట్ దాడులు ఉగ్రవాదులను ఉసిగొల్పాలని చూస్తున్న పాకిస్థాన్​కు గట్టి సందేశమని రావత్​ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్న నూతన పంథాతో పాక్​లో అనిశ్చితి నెలకొందని తెలిపారు.

భారత్​ ఎదిగే కొద్దీ భద్రతా సవాళ్లు ఎదురవుతాయని, అందుకే సైనిక అవసరాలకు ఇతర దేశాలపై ఆధార పడకుండా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని రావత్​ పేర్కొన్నారు. అణ్వాయుధాలు గల రెండు పొరుగు దేశాలు(చైనా, పాక్) వ్యూహాత్మక ప్రాంతీయ అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.