ETV Bharat / bharat

'ఆయనకు కరోనా... మోదీ క్వారంటైన్​లోకి వెళ్లరా?'

author img

By

Published : Aug 16, 2020, 4:13 PM IST

కరోనా బారినపడ్డ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడు నృత్య గోపాల్​ దాస్​ను కలిసిన ప్రధాని మోదీ క్వారంటైన్​ అవుతారా? అని ప్రశ్నించింది శివసేన అధికార పత్రిక సామ్నా. ఇందుకు సంబంధించి పత్రికలో సంపాదకీయం ప్రచురించింది. ఈ నెల 5న అయోధ్యలో జరిగిన రామమందిర భూమిపూజలో గోపాల్​ దాస్​- మోదీ కలుసుకున్నారు. గోపాల్​దాస్​ చేతులను మోదీ పట్టుకున్నారు.

Shiv Sena questions quarantine rules regarding PM Modi  after Nritya Gopal Das tests COVID-19 positive
'క్వారంటైన నిబంధనలను ప్రధాని మోదీ పాటిస్తారా?'

ఈ నెల 5న జరిగిన అయోధ్య రామమందిర భూమిపూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వేదిక పంచుకున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడు నృత్య గోపాల్​ దాస్​కు కరోనా సోకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా.. ఈ విషయాన్ని తన అధికార పత్రిక సామ్నాలో ప్రస్తావించిన శివసేన.. మరి ఇప్పుడు ప్రధాని మోదీ క్వారంటైన్​ నిబంధనలను పాటిస్తారా? అని ప్రశ్నించింది.

"భూమిపూజ సందర్భంగా 75ఏళ్ల గోపాల్​ దాస్​ వేదికపైనే ఉన్నారు. ఆయన మాస్కు కూడా వేసుకోలేదు. ఆయనను ప్రధాని మోదీ, ఆర్​ఎస్​ఎస్​ అధినేత​ మోహన్​ భగవత్​ కలిశారు. ప్రధాని.. గోపాల్​ దాస్​ చేతులను కూడా పట్టుకున్నారు. మరి ఇప్పుడు మన ప్రధాని క్వారంటైన్​ అవుతారా?"

-- సామ్నా సంపాదకీయం.

అయోధ్య భూమిపూజకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేను ఆహ్వానించాలని శివసేన కోరినట్టు సమాచారం. పార్టీ వ్యవస్థాపకుడు బాల్​ ఠాక్రే సహా ఉద్ధవ్​ ఠాక్రే.. రామమందిరం కోసం అనేకమార్లు ఉద్యమించారని, అందువల్ల కచ్చితంగా ఆహ్వానించాలని చెప్పినట్టు తెలుస్తోంది. అయినా ఠాక్రేకు ఆహ్వానం అందలేదు.

ఇదీ చూడండి:- 'వారి త్యాగాలు విస్మరించిన వారు 'రామ ద్రోహులు''

ఈ నెల 5న జరిగిన అయోధ్య రామమందిర భూమిపూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వేదిక పంచుకున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడు నృత్య గోపాల్​ దాస్​కు కరోనా సోకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా.. ఈ విషయాన్ని తన అధికార పత్రిక సామ్నాలో ప్రస్తావించిన శివసేన.. మరి ఇప్పుడు ప్రధాని మోదీ క్వారంటైన్​ నిబంధనలను పాటిస్తారా? అని ప్రశ్నించింది.

"భూమిపూజ సందర్భంగా 75ఏళ్ల గోపాల్​ దాస్​ వేదికపైనే ఉన్నారు. ఆయన మాస్కు కూడా వేసుకోలేదు. ఆయనను ప్రధాని మోదీ, ఆర్​ఎస్​ఎస్​ అధినేత​ మోహన్​ భగవత్​ కలిశారు. ప్రధాని.. గోపాల్​ దాస్​ చేతులను కూడా పట్టుకున్నారు. మరి ఇప్పుడు మన ప్రధాని క్వారంటైన్​ అవుతారా?"

-- సామ్నా సంపాదకీయం.

అయోధ్య భూమిపూజకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేను ఆహ్వానించాలని శివసేన కోరినట్టు సమాచారం. పార్టీ వ్యవస్థాపకుడు బాల్​ ఠాక్రే సహా ఉద్ధవ్​ ఠాక్రే.. రామమందిరం కోసం అనేకమార్లు ఉద్యమించారని, అందువల్ల కచ్చితంగా ఆహ్వానించాలని చెప్పినట్టు తెలుస్తోంది. అయినా ఠాక్రేకు ఆహ్వానం అందలేదు.

ఇదీ చూడండి:- 'వారి త్యాగాలు విస్మరించిన వారు 'రామ ద్రోహులు''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.