పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో టిక్టాక్ వీడియోల చిత్రీకరణను నిషేధించారు. ఆలయ పవిత్రతకు భంగం కలుగుతుందనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ నిర్వహణను పర్యవేక్షించే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ తెలిపింది. ఇటీవలే గుడిలో నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతున్న భక్తుల టిక్టాక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా స్వర్ణ దేవాలయంలో ఇకపై ఈ చిత్రీకరణలను నిషేధిస్తూ గోడ పత్రికలను కూడా అంటించింది.
ఆలయంలో ఇప్పటికే ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం ఉండగా.. భవిష్యత్తులో మొబైల్ ఫోన్లు తీసుకురావడంపైనా ఆంక్షలు విధిస్తామని ప్రబంధక్ కమిటీ వెల్లడించింది.