దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా 17,066 మందికి పాజిటివ్గా తేలింది. మరో 257 మంది మరణించగా.. 15,786 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 10,77,374 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 7,55,850 మంది కోలుకున్నారు.
- కర్ణాటకలో తాజాగా 8,244 కేసులు వెలుగు చూశాయి.. మరో 119 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 4,67,689 మంది బాధితులు ఉండగా.. అందులో 3,61,823 మంది కోలుకున్నారు.
- తమిళనాట రోజూ సగటున 5 వేల కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మరో 5,752 మందికి పాజిటివ్గా తేలింది. ఒక్కరోజులో 53 మంది మృతి చెందగా.. 5,799 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 5,08,511 మంది బాధితులు ఉండగా.. 8,434 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.
- ఉత్తర్ప్రదేశ్లో తాజాగా 5,208 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3,17,195కు చేరింది. 67,287 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,45,417 మంది కోలుకున్నారు.
- దిల్లీలో తాజాగా 3,229 కేసులను గుర్తించారు. దీంతో మొత్తం 2.21 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. మరో 26 మంది మృతి చెందగా...ఇప్పటివరకు 4,770 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.
- దిల్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు పాజిటివ్గా తేలింది. వీరితో పాటు మరో ముగ్గురు అసెంబ్లీ సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.
- ఒడిశాలో తాజాగా 4,198 మందికి పాజిటివ్గా తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 1.55 లక్షలు దాటింది. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 637కు చేరింది.
- కేరళలో కొత్తగా 2,110 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 30,486 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 79,813 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- రాజస్థాన్లో మరో 731 మంది వైరస్ బారిన పడగా.. ఏడుగురు మృతి చెందారు.
- త్రిపురలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 19,187కు చేరింది.
- పుదుచ్చేరిలో తాజాగా 414 కేసులు బయటపడగా... మొత్తం 20 వేలకు పైగా బాధితులు ఉన్నారు. ఇప్పటివరకు 394 మంది మృతి చెందారు.