ETV Bharat / bharat

సీఎంపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీం నో - గోసేవా అవినీతి కేసు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్​పై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ముఖ్యమంత్రి వాదనలు వినకుండానే ఆదేశాలివ్వటం ఆశ్చర్యం కలిగించిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

SC
సుప్రీం
author img

By

Published : Oct 29, 2020, 3:28 PM IST

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్​పై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ముఖ్యమంత్రి వాదన వినకుండానే హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఆశ్చర్యం కలిగించిందని జస్టిస్ అశోక్ భూషణ్​ ధర్మాసనం పేర్కొంది.

సీఎంపై అవినీతి ఆరోపణలకు సంబంధించి జర్నలిస్టులు వేసిన పిటిషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలన్న అభ్యర్థన లేదని తెలిపింది.

రావత్​ తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్... సీఎం వాదనలు వినకుండా ఎఫ్​ఐఆర్ నమోదు చేయలేమని స్పష్టం చేశారు. ఇది ఎన్నిక ద్వారా గెలిచిన ప్రభుత్వంలో గందరగోళాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన రాజీనామాకు డిమాండ్లు వినిపిస్తున్నాయని తెలిపారు. వీటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలిచ్చిందని చెప్పారు.

SC
సీఎం త్రివేంద్ర సింగ్ రావత్

హైకోర్టు ఆదేశాలు..

2016లో గో సేవా ఆయోగ్ ఛైర్మన్ పదవి కోసం ఓ వ్యక్తి ముఖ్యమంత్రి బంధువుకు లంచం ఇచ్చారని వచ్చిన ఆరోపణలపై ఉమేశ్ కుమార్ అనే జర్నలిస్టు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఉత్తరాఖండ్​ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ రావత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్​' పిటిషన్​పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్​పై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ముఖ్యమంత్రి వాదన వినకుండానే హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఆశ్చర్యం కలిగించిందని జస్టిస్ అశోక్ భూషణ్​ ధర్మాసనం పేర్కొంది.

సీఎంపై అవినీతి ఆరోపణలకు సంబంధించి జర్నలిస్టులు వేసిన పిటిషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలన్న అభ్యర్థన లేదని తెలిపింది.

రావత్​ తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్... సీఎం వాదనలు వినకుండా ఎఫ్​ఐఆర్ నమోదు చేయలేమని స్పష్టం చేశారు. ఇది ఎన్నిక ద్వారా గెలిచిన ప్రభుత్వంలో గందరగోళాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన రాజీనామాకు డిమాండ్లు వినిపిస్తున్నాయని తెలిపారు. వీటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలిచ్చిందని చెప్పారు.

SC
సీఎం త్రివేంద్ర సింగ్ రావత్

హైకోర్టు ఆదేశాలు..

2016లో గో సేవా ఆయోగ్ ఛైర్మన్ పదవి కోసం ఓ వ్యక్తి ముఖ్యమంత్రి బంధువుకు లంచం ఇచ్చారని వచ్చిన ఆరోపణలపై ఉమేశ్ కుమార్ అనే జర్నలిస్టు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఉత్తరాఖండ్​ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ రావత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్​' పిటిషన్​పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.