ETV Bharat / bharat

రాహుల్ కోర్టు ధిక్కరణ కేసుపై నేడు విచారణ

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ​ కోర్టు ధిక్కరణ పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. రఫేల్​ తీర్పులో లేని వ్యాఖ్యలను సుప్రీం కోర్టుకు ఆపాదించి రాహుల్​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని భాజపా ఎంపీ మీనాక్షి లేఖి పిటిషన్​ వేశారు. ఈ కేసులో ఇప్పటికే రాహుల్ రెండు సార్లు అఫిడవిట్​ దాఖలు చేశారు.

author img

By

Published : Apr 30, 2019, 7:08 AM IST

Updated : Apr 30, 2019, 8:54 AM IST

రాహుల్ కోర్టు ధిక్కరణ కేసులో నేడు విచారణ
రాహుల్ కోర్టు ధిక్కరణ కేసులో నేడు విచారణ

రఫేల్​ తీర్పులో లేని వ్యాఖ్యలను న్యాయస్థానానికి ఆపాదించి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని భాజపా ఎంపీ మీనాక్షి లేఖి వేసిన పిటిషన్​ నేడు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది.

కోర్టు ధిక్కరణ నోటీసులపై సుప్రీంకోర్టులో రాహుల్​ గాంధీ సోమవారం మరోసారి అఫిడవిట్ దాఖలు చేశారు. రఫేల్ తీర్పుపై చేసిన వ్యాఖ్యలకు మరోసారి విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు రాహుల్.

రాజకీయ దురుద్దేశంతోనే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారని ధర్మాసనానికి తెలిపారు కాంగ్రెస్​ అధ్యక్షుడు. రఫేల్​పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 'కాపలాదారు దొంగ' అని నిర్ధరణ అయిందని రాహుల్​ గాంధీ గతంలో మోదీని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 23న రాహుల్​కు సుప్రీం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

రాహుల్ కోర్టు ధిక్కరణ కేసులో నేడు విచారణ

రఫేల్​ తీర్పులో లేని వ్యాఖ్యలను న్యాయస్థానానికి ఆపాదించి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని భాజపా ఎంపీ మీనాక్షి లేఖి వేసిన పిటిషన్​ నేడు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది.

కోర్టు ధిక్కరణ నోటీసులపై సుప్రీంకోర్టులో రాహుల్​ గాంధీ సోమవారం మరోసారి అఫిడవిట్ దాఖలు చేశారు. రఫేల్ తీర్పుపై చేసిన వ్యాఖ్యలకు మరోసారి విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు రాహుల్.

రాజకీయ దురుద్దేశంతోనే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారని ధర్మాసనానికి తెలిపారు కాంగ్రెస్​ అధ్యక్షుడు. రఫేల్​పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 'కాపలాదారు దొంగ' అని నిర్ధరణ అయిందని రాహుల్​ గాంధీ గతంలో మోదీని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 23న రాహుల్​కు సుప్రీం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

Kanpur (Uttar Pradesh), Apr 30 (ANI): Bharatiya Janata Party (BJP) leader Suresh Awasthi threatened a Circle Officer (CO) in Uttar Pradesh's Kanpur on Monday after an argument over a polling agent. Circle Officer was posted at the polling booth in Kanpur. Suresh Awasthi told the circle officer, "I will see you tomorrow, you are on my hit list." Kanpur Mayor Pramila Pandey was also present when this incident took place. A case has been registered against Suresh Awasthi in this regard.
Last Updated : Apr 30, 2019, 8:54 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.