ETV Bharat / bharat

ఫ్లిప్‌కార్ట్‌ సచిన్‌ బన్సల్‌పై వరకట్న వేధింపుల కేసు

ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్లిప్​కార్ట్​ సహ వ్యవస్థాపకుడు సచిన్​ బన్సల్​పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు​ నమోదైంది.

author img

By

Published : Mar 5, 2020, 1:34 PM IST

Sachin Bansal's wife Priya Bansal filed a case against his father, mother and ... Sachin Bansal, the co-founder of retail online giant Flipkart
ఫ్లిప్‌కార్ట్‌ సచిన్‌ బన్సల్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు

భారతీయ వ్యాపారవేత్త, ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ (38)పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆయన భార్య ప్రియా బన్సల్‌ బెంగళూరులోని కోరమంగళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దంత వైద్యురాలైన ప్రియ ..బెంగళూరులో ఓ వైద్యశాలను నిర్వహిస్తోంది. బన్సల్‌ దంపతులకు పదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు.

తమ వివాహ సమయంలో తన తండ్రి రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశారని.. కారు కొనుగోలు చేసేందుకు సచిన్‌కు రూ.11 లక్షల మొత్తాన్ని అందచేశారని ప్రియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తులను తన పేరు మీదకు బదిలీ చేయాల్సిందిగా సచిన్‌ తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను అందుకు నిరాకరించడం వల్ల.. సచిన్‌ తల్లిదండ్రులు, సోదరుడు తనను వేధిస్తున్నారన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు సచిన్‌ బన్సల్‌తో పాటు ఆయన తండ్రి సత్‌ప్రకాశ్‌ అగర్వాల్‌, తల్లి కిరణ్‌ బన్సల్‌, సోదరుడు నితిన్‌ బన్సల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఆగస్టు 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించారు. ఈ డీల్‌లో తన వాటా 5.5 శాతాన్ని సచిన్‌ ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించారు. దానితో ఆయన నికర ఆస్తుల విలువ 1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ ఒప్పందం వల్ల తమ జీవితం అద్భుతమైన మలుపు తిరిగిందని ప్రియా బన్సల్‌ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచిన్‌పై ఆమె ఫిర్యాదు చేయటం గమనార్హం.

ఇదీ చదవండి: భారత్​లో 29 కరోనా కేసులు: రాజ్యసభలో కేంద్ర మంత్రి

భారతీయ వ్యాపారవేత్త, ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ (38)పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆయన భార్య ప్రియా బన్సల్‌ బెంగళూరులోని కోరమంగళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దంత వైద్యురాలైన ప్రియ ..బెంగళూరులో ఓ వైద్యశాలను నిర్వహిస్తోంది. బన్సల్‌ దంపతులకు పదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు.

తమ వివాహ సమయంలో తన తండ్రి రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశారని.. కారు కొనుగోలు చేసేందుకు సచిన్‌కు రూ.11 లక్షల మొత్తాన్ని అందచేశారని ప్రియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తులను తన పేరు మీదకు బదిలీ చేయాల్సిందిగా సచిన్‌ తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను అందుకు నిరాకరించడం వల్ల.. సచిన్‌ తల్లిదండ్రులు, సోదరుడు తనను వేధిస్తున్నారన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు సచిన్‌ బన్సల్‌తో పాటు ఆయన తండ్రి సత్‌ప్రకాశ్‌ అగర్వాల్‌, తల్లి కిరణ్‌ బన్సల్‌, సోదరుడు నితిన్‌ బన్సల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఆగస్టు 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించారు. ఈ డీల్‌లో తన వాటా 5.5 శాతాన్ని సచిన్‌ ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించారు. దానితో ఆయన నికర ఆస్తుల విలువ 1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ ఒప్పందం వల్ల తమ జీవితం అద్భుతమైన మలుపు తిరిగిందని ప్రియా బన్సల్‌ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచిన్‌పై ఆమె ఫిర్యాదు చేయటం గమనార్హం.

ఇదీ చదవండి: భారత్​లో 29 కరోనా కేసులు: రాజ్యసభలో కేంద్ర మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.