గుజరాత్ వడోదరాలోని సర్ సయాజీరావు ఆసుపత్రిలో కరోనా బాధితులకు ఆహారం, మందులు అందిస్తున్నాయి రెండు రోబోలు. సమయానుకూలంగా రోగులకు స్క్రీనింగ్ నిర్వహిస్తూ.. వైద్య సిబ్బందికి కరోనా సోకే ప్రమాదాన్ని తగ్గిస్తున్నాయి.
చకాచకా కదలాడుతూ.. రోగులకు సేవలందిస్తోన్న ఈ రోబోలు భారతదేశంలో తయారైనవే. క్లబ్ ఫస్ట్ టెక్నాలజీ సంస్థ వీటిని తయారు చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే నాలుగు గంటలు ఆగకుండా పని చేయగల ఈ రోబోలు.. కరోనా సోకిన వారి నుంచి వైరస్ మరొకరికి వ్యాపించకుండా కీలక పాత్ర పోషిస్తున్నాయి. త్వరలో ఓ రోబో ఆసుపత్రి గేటు వద్ద నిల్చుని.. లోనికి ప్రవేశించేవారిని గేటు వద్దే స్క్రీనింగ్ చేయనుందన్నారు ఆసుపత్రి నిర్వాహకులు.
"ఇవి భారతదేశంలో తయారైన రోబోలు. వీటిని ఆపరేట్ చేయడం ఎంతో సులభం. ఈ రోబోలు అచ్చం మనిషిలాగే పని చేస్తాయి. కరోనా రోగులకు సేవ చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. "
-భువనేశ్ మిశ్రా, క్లబ్ ఫస్ట్ టెక్నాలజీ ఎండీ
ఇదీ చదవండి: కరోనా నమూనాలు సేకరిస్తున్న రోబో!