ETV Bharat / bharat

'జీవించే హక్కు కంటే మత హక్కు ఎక్కువ కాదు'

author img

By

Published : Jan 7, 2021, 5:47 PM IST

తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామిలో ఆలయ ఉత్సవాలకు సంబంధించిన పిటిషన్​ను విచారించిన మద్రాసు హైకోర్టు.. జీవించే హక్కు కంటే మతహక్కు ఎక్కువ కాదని వ్యాఖ్యానించింది. కొవిడ్​-19 ప్రోటోకాల్​, ప్రజారోగ్యంతో రాజీ పడకుండా మత ఆచారాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Right to religion not higher than right to life: Madras HC
'జీవించే హక్కు కంటే మతహక్కు ఎక్కువ కాదు'

జీవించే హక్కు కంటే మత హక్కు ఎక్కువ కాదని పేర్కొంది మద్రాసు హైకోర్టు. కరోనా ప్రోటోకాల్​, ప్రజారోగ్యంతో రాజీ పడకుండా మత ఆచారాలను నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ధర్మాసనం జోక్యం చేసుకోదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సంజీబ్​ బెనర్జీ స్పష్టం చేశారు. 'మతపరమైన ఆచారాలు ప్రజా ప్రయోజనాలకు, జీవించే హక్కుకు లోబడి ఉండాలి' అని వ్యాఖ్యానించారు.

తిరుచిరాపల్లి జిల్లాలోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో నిర్విహంచే ఉత్సవాలు, ఆచారాలు కొవిడ్​ ప్రోటోకాల్​, ప్రజారోగ్యంతో రాజీ పడకుండా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్​ బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం. కరోనా నేపథ్యంలో దుర్గాపూజలో భక్తుల రద్దీని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని బంగాల్​ ప్రభుత్వానికి కోల్​కతా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రసావించింది.

శ్రీరంగం ఆలయంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. రంగరాజన్​ నరసింహన్​ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా నేపథ్యంలో వివిధ తేదీల్లో వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ తరఫు న్యాయవాది సీనియర్​ అడ్వొకేట్​ సతీశ్​ పరాశరన్ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన రికార్డులు ధర్మాసనానికి సమర్పించారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశించిన న్యాయస్థానం.. ఆరు వారాలకు విచారణను వాయిదా వేసింది.​

ఇదీ చూడండి: భక్తులకు శుభవార్త- 'శబరిమల రైలు'కు ఓకే

జీవించే హక్కు కంటే మత హక్కు ఎక్కువ కాదని పేర్కొంది మద్రాసు హైకోర్టు. కరోనా ప్రోటోకాల్​, ప్రజారోగ్యంతో రాజీ పడకుండా మత ఆచారాలను నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ధర్మాసనం జోక్యం చేసుకోదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సంజీబ్​ బెనర్జీ స్పష్టం చేశారు. 'మతపరమైన ఆచారాలు ప్రజా ప్రయోజనాలకు, జీవించే హక్కుకు లోబడి ఉండాలి' అని వ్యాఖ్యానించారు.

తిరుచిరాపల్లి జిల్లాలోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో నిర్విహంచే ఉత్సవాలు, ఆచారాలు కొవిడ్​ ప్రోటోకాల్​, ప్రజారోగ్యంతో రాజీ పడకుండా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్​ బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం. కరోనా నేపథ్యంలో దుర్గాపూజలో భక్తుల రద్దీని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని బంగాల్​ ప్రభుత్వానికి కోల్​కతా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రసావించింది.

శ్రీరంగం ఆలయంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. రంగరాజన్​ నరసింహన్​ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా నేపథ్యంలో వివిధ తేదీల్లో వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ తరఫు న్యాయవాది సీనియర్​ అడ్వొకేట్​ సతీశ్​ పరాశరన్ కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన రికార్డులు ధర్మాసనానికి సమర్పించారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశించిన న్యాయస్థానం.. ఆరు వారాలకు విచారణను వాయిదా వేసింది.​

ఇదీ చూడండి: భక్తులకు శుభవార్త- 'శబరిమల రైలు'కు ఓకే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.