ETV Bharat / bharat

ఏఎన్​-32 ప్రయాణికులకై గాలింపు ముమ్మరం

తొమ్మిది రోజుల ముందు గల్లంతైన ఏఎన్​-32 విమానం శకలాలను మంగళవారం అరుణాచల్​ప్రదేశ్​లోని సియాంగ్​ జిల్లాలో గుర్తించింది ఐఏఎఫ్. ఆ ప్రాంతంలో సైన్యం గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టింది. అత్యాధునిక విమానాలు రంగంలోకి దిగాయి.

author img

By

Published : Jun 12, 2019, 9:40 AM IST

Updated : Jun 12, 2019, 1:08 PM IST

ఏఎన్​-32లో గల్లంతైన వారికోసం గాలింపు
గాలింపు ముమ్మరం

భారత వాయుసేనకు చెందిన ఏఎన్​-32 విమానం కూలిన ప్రదేశంలో సైన్యం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఎమ్​ఐ-17విమానాలు సహా అత్యాధునిక లైట్​ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది సైన్యం.

ఈ నెల​ 3న గల్లంతైన ఏఎన్​-32 విమాన శకలాలను మంగళవారం ఐఏఎఫ్​ గుర్తించింది. అరుణాచల్​ ప్రదేశ్​లోని సియాంగ్​ జిల్లా పయూమ్​ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు. విమాన శకలాలు దొరికిన నేపథ్యంలో అందులోని 13 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.

ఇదీ జరిగింది..

జూన్ 3 మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్​ వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది ఏఎన్​-32 విమానం. కొద్ది సేపటికే విమానం గల్లంతైంది. అది అరుణాచల్ ప్రదేశ్​ మెన్చుకా అడ్వాన్స్ ల్యాండింగ్​ గ్రౌండ్​కు చేరుకోవాల్సి ఉంది. ఇందులో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి 13 మంది ఉన్నారు. మంగళవారం విమాన శకలాలను కనుగొన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఐఏఎఫ్ తెలిపింది.

ఇదీ చూడండి:- బాలిక మృతదేహాన్ని దేవుడికి అర్పించిన గ్రామస్థులు

గాలింపు ముమ్మరం

భారత వాయుసేనకు చెందిన ఏఎన్​-32 విమానం కూలిన ప్రదేశంలో సైన్యం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఎమ్​ఐ-17విమానాలు సహా అత్యాధునిక లైట్​ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది సైన్యం.

ఈ నెల​ 3న గల్లంతైన ఏఎన్​-32 విమాన శకలాలను మంగళవారం ఐఏఎఫ్​ గుర్తించింది. అరుణాచల్​ ప్రదేశ్​లోని సియాంగ్​ జిల్లా పయూమ్​ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు. విమాన శకలాలు దొరికిన నేపథ్యంలో అందులోని 13 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.

ఇదీ జరిగింది..

జూన్ 3 మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్​ వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది ఏఎన్​-32 విమానం. కొద్ది సేపటికే విమానం గల్లంతైంది. అది అరుణాచల్ ప్రదేశ్​ మెన్చుకా అడ్వాన్స్ ల్యాండింగ్​ గ్రౌండ్​కు చేరుకోవాల్సి ఉంది. ఇందులో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి 13 మంది ఉన్నారు. మంగళవారం విమాన శకలాలను కనుగొన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఐఏఎఫ్ తెలిపింది.

ఇదీ చూడండి:- బాలిక మృతదేహాన్ని దేవుడికి అర్పించిన గ్రామస్థులు

Intro:Body:Conclusion:
Last Updated : Jun 12, 2019, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.