ETV Bharat / bharat

యాక్టివ్‌ కరోనా కేసులు 6.6 లక్షలే!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు వస్తున్నప్పటికీ.. అదే స్ధాయిలో రికవరీలు నమోదవుతున్నాయి. తాజాగా 57 వేల మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 18 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారానికి యాక్టివ్​ కేసులు 6.6 లక్షలుగా ఉన్నాయని పేర్కొంది

author img

By

Published : Aug 15, 2020, 5:42 PM IST

Updated : Aug 15, 2020, 6:54 PM IST

Record 57,381 COVID-19 patients discharged in a day, recovery rate rises to 71.61 pc: Health ministry
దేశంలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 57,381 మంది డిశ్చార్జి

మెరుగైన చికిత్స, వ్యాధిపై అవగాహన పెరగడంతో కొవిడ్‌-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 57,381 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని పేర్కొంది. రికవరీ రేటు 71.61శాతానికి చేరుకుందని వెల్లడించింది.

‘టెస్టు, ట్రాక్‌‌, ట్రీట్‌’లో భాగంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,68,679 కొవిడ్‌-19 పరీక్షలు చేశామని ప్రభుత్వం తెలిపింది. ఫలితంగా ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 2.85 కోట్లకు చేరుకుందని వెల్లడించింది. 12 రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ సగటు కన్నా మెరుగ్గా ఉందని ప్రశంసించింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకుంటున్న వారు 50% కన్నా ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది.

దిల్లీలో అత్యధికంగా 89.87% మంది కోలుకున్నారు. గుజరాత్‌ 77.53%, మధ్యప్రదేశ్‌ 74.70%, పశ్చిమ్‌బెంగాల్‌ 73.25%, రాజస్థాన్‌ 72.84%, తెలంగాణ 72.72%, ఒడిశాలో 71.98% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 18,08,936 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకోవడంతో యాక్టివ్‌, రికవరీ కేసుల మధ్య అంతరం 11,40,716 (శనివారం)కు చేరుకుందని కేంద్రం తెలిపింది. శనివారానికి మొత్తంగా 6,68,220 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని మొత్తం కేసుల్లో ఇవి 26.45 శాతమేనని వెల్లడించింది. మెరుగైన చికిత్స, వైద్యుల పర్యవేక్షణ వల్ల మరణాల రేటు 1.94%కి తగ్గిందని పేర్కొంది.

ఇదీ చూడండి జమ్ముకశ్మీర్​లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

మెరుగైన చికిత్స, వ్యాధిపై అవగాహన పెరగడంతో కొవిడ్‌-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 57,381 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని పేర్కొంది. రికవరీ రేటు 71.61శాతానికి చేరుకుందని వెల్లడించింది.

‘టెస్టు, ట్రాక్‌‌, ట్రీట్‌’లో భాగంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,68,679 కొవిడ్‌-19 పరీక్షలు చేశామని ప్రభుత్వం తెలిపింది. ఫలితంగా ఇప్పటి వరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 2.85 కోట్లకు చేరుకుందని వెల్లడించింది. 12 రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ సగటు కన్నా మెరుగ్గా ఉందని ప్రశంసించింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకుంటున్న వారు 50% కన్నా ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది.

దిల్లీలో అత్యధికంగా 89.87% మంది కోలుకున్నారు. గుజరాత్‌ 77.53%, మధ్యప్రదేశ్‌ 74.70%, పశ్చిమ్‌బెంగాల్‌ 73.25%, రాజస్థాన్‌ 72.84%, తెలంగాణ 72.72%, ఒడిశాలో 71.98% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 18,08,936 మంది కొవిడ్‌-19 నుంచి కోలుకోవడంతో యాక్టివ్‌, రికవరీ కేసుల మధ్య అంతరం 11,40,716 (శనివారం)కు చేరుకుందని కేంద్రం తెలిపింది. శనివారానికి మొత్తంగా 6,68,220 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని మొత్తం కేసుల్లో ఇవి 26.45 శాతమేనని వెల్లడించింది. మెరుగైన చికిత్స, వైద్యుల పర్యవేక్షణ వల్ల మరణాల రేటు 1.94%కి తగ్గిందని పేర్కొంది.

ఇదీ చూడండి జమ్ముకశ్మీర్​లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Last Updated : Aug 15, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.