ETV Bharat / bharat

'చైనా ఆక్రమణ' వ్యాఖ్యలపై రాజ్​నాథ్ మండిపాటు

author img

By

Published : Oct 31, 2020, 10:22 PM IST

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై రక్షణమంత్రి రాజ్​నాథ్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బిహార్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. భారత సార్వభౌమధికారాన్ని రక్షించేందుకు సైనికులు శౌర్యపరాక్రమాలు ప్రదర్శించారని కొనియాడారు.

Rajnath
రాజ్​నాథ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత భూభాగంలోకి 1,200 కిలోమీటర్ల దూరం చైనా చొరబడిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

బిహార్​లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న రాజ్​నాథ్.. విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"కొన్ని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ అంటున్నారు. కానీ నిజమేంటంటే.. దేశ గౌరవం కాపాడేందుకు మన సైనికులు శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు. బాలాకోట్​పై వాయుదాడులకు సంబంధించి వాళ్లు ఆధారాలు కోరారు. పుల్వామాలో పాక్ పాత్రపై ఆ దేశ మంత్రి ఫవాద్ చౌధురి ప్రకటన చేశారు. ఇప్పటికైనా ఈ విషయంలో కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి."

- రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

రాహుల్ ఆరోపణలు..

పంజాబ్​లో గతవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ ఆరోపించారు. 1,200 కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు భారత్ అప్పగించిందన్నారు.

దీనిపై స్పందించిన రాజ్​నాథ్​.. భారత్​ నుంచి ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణ జరగలేదని స్పష్టం చేశారు. దేశ సమగ్రత విషయంలో కాంగ్రెస్ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదన్నారు.

ఫవాద్ ప్రకటన..

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్​ నేత ఫవాద్ పార్లమెంటు సాక్షిగా అంగీకరించారు. పైగా పిరికిపందలా దాడి చేయడాన్ని తమ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలో సాధించిన ఈ విజయంలో మనమంతా భాగస్వాములేనని అన్నారు.

ఈ ప్రకటన తర్వాత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావటం వల్ల ఫవాద్ మళ్లీ మాట మార్చారు. తాను ప్రస్తావించింది పుల్వామా దాడి తర్వాత విషయాల గురించి అంటూ బుకాయించారు. మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పారు.

ఇదీ చూడండి: 'నిరుద్యోగం గురించి మోదీ ఎందుకు మాట్లాడరు?'

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత భూభాగంలోకి 1,200 కిలోమీటర్ల దూరం చైనా చొరబడిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

బిహార్​లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న రాజ్​నాథ్.. విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"కొన్ని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ అంటున్నారు. కానీ నిజమేంటంటే.. దేశ గౌరవం కాపాడేందుకు మన సైనికులు శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు. బాలాకోట్​పై వాయుదాడులకు సంబంధించి వాళ్లు ఆధారాలు కోరారు. పుల్వామాలో పాక్ పాత్రపై ఆ దేశ మంత్రి ఫవాద్ చౌధురి ప్రకటన చేశారు. ఇప్పటికైనా ఈ విషయంలో కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి."

- రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

రాహుల్ ఆరోపణలు..

పంజాబ్​లో గతవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ ఆరోపించారు. 1,200 కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు భారత్ అప్పగించిందన్నారు.

దీనిపై స్పందించిన రాజ్​నాథ్​.. భారత్​ నుంచి ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణ జరగలేదని స్పష్టం చేశారు. దేశ సమగ్రత విషయంలో కాంగ్రెస్ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదన్నారు.

ఫవాద్ ప్రకటన..

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్​ నేత ఫవాద్ పార్లమెంటు సాక్షిగా అంగీకరించారు. పైగా పిరికిపందలా దాడి చేయడాన్ని తమ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలో సాధించిన ఈ విజయంలో మనమంతా భాగస్వాములేనని అన్నారు.

ఈ ప్రకటన తర్వాత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావటం వల్ల ఫవాద్ మళ్లీ మాట మార్చారు. తాను ప్రస్తావించింది పుల్వామా దాడి తర్వాత విషయాల గురించి అంటూ బుకాయించారు. మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పారు.

ఇదీ చూడండి: 'నిరుద్యోగం గురించి మోదీ ఎందుకు మాట్లాడరు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.