ETV Bharat / bharat

సెప్టెంబర్​ 10న వాయుసేనలోకి 'రఫేల్ జెట్స్​'​!

author img

By

Published : Aug 28, 2020, 2:40 PM IST

రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ 10 అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. అంబాలా వైమానిక స్థావరంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భారత్​, ఫ్రాన్స్​ రక్షణ మంత్రులు హాజరుకానున్నారు.

Rafales
సెప్టెంబర్​ 10న వైమానిక దళంలోకి 'రఫేల్ జెట్స్​'​!

భారత్​ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు అధికారికంగా వైమానిక దళంలో చేరనున్నాయి. అందుకు సెప్టెంబర్​ 10న ముహూర్తం ఖరారు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ సహా.. ఉన్నతస్థాయి సైన్యాధికారులు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఫ్రాన్స్​ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లీ. అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ఇరువురు రక్షణ మంత్రులు చర్చించనున్నారు. పార్లీ భారత్​ పర్యటన అవకాశాలపై ఇరు దేశాల అధికారులు పలు దఫాలు చర్చించిన తర్వాతే సెప్టెంబర్​ 10న ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.

అక్టోబర్​లో రెండో దశ

36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ఐదింటిని భారత్​ అందించింది ఫ్రాన్స్​. రెండో దశలో మరో నాలుగు విమానాలు వచ్చే అక్టోబర్​లో భారత్​కు చేరనున్నాయని వైమానిక వర్గాలు తెలిపాయి.

2016లో ఒప్పందం..

36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రూ. 58వేల కోట్లతో 2016లో ఫ్రాన్స్​తో ఒప్పందం చేసుకుంది భారత్​. తొలిదశలో భాగంగా ఈ ఏడాది జులై 29న అంబాలా వైమానిక స్థావరానికి 5 రఫేల్​ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. 36 రఫేల్ జెట్స్​లో 30 యుద్ధ విమానాలు కాగా.. ఆరు శిక్షణ కోసం వినియోగించేవి ఉన్నాయి. రఫేల్ జెట్స్​ తొలి స్వ్కాడ్రన్​ను అంబాలా వైమానిక స్థావరంలో, రెండో స్వ్కాడ్రన్​ను బంగాల్​లోని హసిమారా స్థావరంలో ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చూడండి: భారత్​కు రఫేల్​- వాయుసేనకు కొత్త శక్తి

భారత్​ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు అధికారికంగా వైమానిక దళంలో చేరనున్నాయి. అందుకు సెప్టెంబర్​ 10న ముహూర్తం ఖరారు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ సహా.. ఉన్నతస్థాయి సైన్యాధికారులు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు ఫ్రాన్స్​ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లీ. అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ఇరువురు రక్షణ మంత్రులు చర్చించనున్నారు. పార్లీ భారత్​ పర్యటన అవకాశాలపై ఇరు దేశాల అధికారులు పలు దఫాలు చర్చించిన తర్వాతే సెప్టెంబర్​ 10న ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.

అక్టోబర్​లో రెండో దశ

36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ఐదింటిని భారత్​ అందించింది ఫ్రాన్స్​. రెండో దశలో మరో నాలుగు విమానాలు వచ్చే అక్టోబర్​లో భారత్​కు చేరనున్నాయని వైమానిక వర్గాలు తెలిపాయి.

2016లో ఒప్పందం..

36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రూ. 58వేల కోట్లతో 2016లో ఫ్రాన్స్​తో ఒప్పందం చేసుకుంది భారత్​. తొలిదశలో భాగంగా ఈ ఏడాది జులై 29న అంబాలా వైమానిక స్థావరానికి 5 రఫేల్​ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. 36 రఫేల్ జెట్స్​లో 30 యుద్ధ విమానాలు కాగా.. ఆరు శిక్షణ కోసం వినియోగించేవి ఉన్నాయి. రఫేల్ జెట్స్​ తొలి స్వ్కాడ్రన్​ను అంబాలా వైమానిక స్థావరంలో, రెండో స్వ్కాడ్రన్​ను బంగాల్​లోని హసిమారా స్థావరంలో ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చూడండి: భారత్​కు రఫేల్​- వాయుసేనకు కొత్త శక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.