ETV Bharat / bharat

'కే-9 వజ్ర' యుద్ధ ట్యాంకును ఆవిష్కరించిన రాజ్​నాథ్ - లార్సెన్ అండ్ టర్బో

సూరత్​లోని 'హజీరా లార్సెన్ అండ్ టర్బో' కర్మాగారంలో కే-9 వజ్ర-టీ యుద్ధ ట్యాంకును రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఆవిష్కరించారు. యుద్ధ ట్యాంకులో ప్రయాణించి పనితీరును పరిశీలించారు రాజ్​నాథ్. 'మేక్​ ఇన్​ ఇండియా' ద్వారా భారత్​ ఆయుధ ఎగుమతిదారుగా మారుతుందన్నారు.

Rajnath Singh flags off 51st K-9 Vajra at L&T gun making facility
కే-9 వజ్ర యుద్ధ ట్యాంకును ఆవిష్కరించిన రాజ్​నాథ్
author img

By

Published : Jan 16, 2020, 9:55 PM IST

రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ 51వ కే-9 వజ్ర-టీ యుద్ధ ట్యాంకును ప్రారంభించారు. సూరత్​లోని హజీరాలో ఉన్న 'లార్సెన్ అండ్ టర్బో' (ఎల్ ​అండ్ ​టీ) ఆయుధ వ్యవస్థ కర్మాగారంలో వీటిని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ట్యాంకుపై స్వస్తిక్ ముద్రను వేసి ఆయుధ పూజ చేశారు రాజ్​నాథ్​. యుద్ధ ట్యాంకులో ప్రయాణిస్తూ పనితీరును పరిశీలించారు. ఒకప్పుడు ప్రైవేటు భాగస్వామ్యం లేని రంగాల్లో రక్షణ రంగం ఒకటని.... కానీ ప్రస్తుతం 'మేక్​ ఇన్​ ఇండియా'లో భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ఫలితంగా భవిష్యత్తులో భారత్ నికర​ ఆయుధ ఎగుమతిదారుగా మారుతుందని ఉద్ఘాటించారు.

రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

"వజ్ర యుద్ధ ట్యాంకును చూసినప్పుడు అందులో ఓ పటిష్ఠమైన ఆయుధం మాత్రమే కాదు, పటిష్టమైన భారత్​ కూడా కనిపించింది. రక్షణ రంగంలో మేక్​ ఇన్​ ఇండియాకి ఇదో అద్భుతమైన ఉదాహరణ."-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

యుద్ధ ట్యాంకు విశేషాలు

50 టన్నుల బరువుండే ఈ యుద్ధ ట్యాంకు 47 కిలోల బాంబులను విసరగలదు. 43 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సున్నా వ్యాసార్థంలో ఈ ట్యాంకు తన చుట్టూ తాను తిరగగలడం మరో ప్రత్యేకత. మేక్​ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 2017లో ఎల్​అండ్​టీ సంస్థ రూ.4,500 కోట్ల రూపాయల కాంట్రాక్టును రక్షణ శాఖ నుంచి దక్కించుకుంది. ఇందులో భాగంగా 100 కే9 వజ్ర-టీ కేటగరీ యుద్ధ ట్యాంకులను 42 నెలల్లో ఆర్మీకి అందించనుంది. ఇప్పటివరకు 51 ట్యాంకులను ఆర్మీకి అందజేసింది. ఓ ప్రైవేటు సంస్థకు రక్షణ శాఖ ఇచ్చిన అతిపెద్ద కాంట్రాక్టు ఇదే కావడం గమనార్హం.

రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ 51వ కే-9 వజ్ర-టీ యుద్ధ ట్యాంకును ప్రారంభించారు. సూరత్​లోని హజీరాలో ఉన్న 'లార్సెన్ అండ్ టర్బో' (ఎల్ ​అండ్ ​టీ) ఆయుధ వ్యవస్థ కర్మాగారంలో వీటిని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ట్యాంకుపై స్వస్తిక్ ముద్రను వేసి ఆయుధ పూజ చేశారు రాజ్​నాథ్​. యుద్ధ ట్యాంకులో ప్రయాణిస్తూ పనితీరును పరిశీలించారు. ఒకప్పుడు ప్రైవేటు భాగస్వామ్యం లేని రంగాల్లో రక్షణ రంగం ఒకటని.... కానీ ప్రస్తుతం 'మేక్​ ఇన్​ ఇండియా'లో భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ఫలితంగా భవిష్యత్తులో భారత్ నికర​ ఆయుధ ఎగుమతిదారుగా మారుతుందని ఉద్ఘాటించారు.

రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

"వజ్ర యుద్ధ ట్యాంకును చూసినప్పుడు అందులో ఓ పటిష్ఠమైన ఆయుధం మాత్రమే కాదు, పటిష్టమైన భారత్​ కూడా కనిపించింది. రక్షణ రంగంలో మేక్​ ఇన్​ ఇండియాకి ఇదో అద్భుతమైన ఉదాహరణ."-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

యుద్ధ ట్యాంకు విశేషాలు

50 టన్నుల బరువుండే ఈ యుద్ధ ట్యాంకు 47 కిలోల బాంబులను విసరగలదు. 43 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సున్నా వ్యాసార్థంలో ఈ ట్యాంకు తన చుట్టూ తాను తిరగగలడం మరో ప్రత్యేకత. మేక్​ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 2017లో ఎల్​అండ్​టీ సంస్థ రూ.4,500 కోట్ల రూపాయల కాంట్రాక్టును రక్షణ శాఖ నుంచి దక్కించుకుంది. ఇందులో భాగంగా 100 కే9 వజ్ర-టీ కేటగరీ యుద్ధ ట్యాంకులను 42 నెలల్లో ఆర్మీకి అందించనుంది. ఇప్పటివరకు 51 ట్యాంకులను ఆర్మీకి అందజేసింది. ఓ ప్రైవేటు సంస్థకు రక్షణ శాఖ ఇచ్చిన అతిపెద్ద కాంట్రాక్టు ఇదే కావడం గమనార్హం.

Rajkot (Gujarat), Jan 16 (ANI): Team India was seen practicing in full spirit for second ODI against Australia in Rajkot. Team requires win in 2nd ODI to stay in series after setback in 1st ODI. Australia registered a comfortable victory with 10 wickets at Wankhede Stadium. 2nd ODI will be played on January 17.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.