ETV Bharat / bharat

భర్తను చంపి ముక్కలుగా నరికి.. సంచిలో! - wife killed husband in jodhpur

కట్టుకున్నవాడినే కడతేర్చి.. శరీరాన్ని ముక్కలుగా చేసి గోనె సంచిలో కట్టిపడేసింది ఓ కిరాతక భార్య. ఇద్దరు సోదరీమణులు, ఓ స్నేహితుడితో కలిసి ఇంతటి ఘాతుకానికి పాల్పడింది. ఇప్పుడు రాజస్థాన్ పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది.

rajasthan-woman-chops-hubbys-body-dumps-pieces-near-cement-plant-held
భర్తను చంపి.. ముక్కలు సంచిలో కట్టిపడేసింది !
author img

By

Published : Aug 14, 2020, 12:22 PM IST

రాజస్థాన్ జోధ్​పుర్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. భర్తను హతమార్చి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి పడేసింది ఓ భార్య.

నెల రోజుల క్రితం జోధ్​పుర్ నందడి గ్రామానికి చెందిన చరణ్ సింగ్ కనబడటం లేదంటూ బనాడ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. ఆగస్టు 10న సిమెంట్ ప్లాంట్ వద్ద తునాతునకలై పడిఉన్న ఓ మృతదేహం లభ్యమైంది. విచారణలో ఆ శరీర భాగాలు చరణ్​వే అని తేలింది. దీంతో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అనుమానితుల్లో చరణ్ భార్య సీమా, ఆమె సోదరిలు బబిత, ప్రియాంకలతో పాటు అదే గ్రామానికి చెందిన భియారామ్ ఉన్నారు.

చరణ్, సీమాలు ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. జులై 11న రాత్రి.. సీమా, తన సోదరి.. చరణ్​ను ఓ ఖాళీ ఫ్లాట్​కు రమ్మన్నారు. అక్కడికి చేరుకున్న చరణ్​కు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన చరణ్ స్ఫృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత భియారామ్ సాయంతో చరణ్ గొంతు నులిమి చంపేశారు. అంతటితో ఆగక.. పదునైన ఆయుధంతో ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఓ గోనె సంచిలో శరీర భాగాలు వేసి.. సమీపంలోని సిమెంట్ ప్లాంట్ వద్ద ఆ సంచిని పడేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు వివరాలను వెల్లడించారు.

"ఓ ఫొరెన్సిక్ బృందాన్ని ఘటనా స్థలానికి పంపించాం. విచారణలో సీమా తానే భర్తను చంపినట్లు అంగీకరించింది. మేము నిందితులను 48 గంటల్లోగా పట్టుకున్నాం. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించాం. నిందితులను విచారిస్తున్నాం. "

-ధర్మేంద్ర యాదవ్, జోధ్​పుర్ డీసీపీ

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: సినీ ఫక్కీలో 'గర్ల్​ ఫ్రెండ్' కిడ్నాప్!

రాజస్థాన్ జోధ్​పుర్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. భర్తను హతమార్చి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి పడేసింది ఓ భార్య.

నెల రోజుల క్రితం జోధ్​పుర్ నందడి గ్రామానికి చెందిన చరణ్ సింగ్ కనబడటం లేదంటూ బనాడ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. ఆగస్టు 10న సిమెంట్ ప్లాంట్ వద్ద తునాతునకలై పడిఉన్న ఓ మృతదేహం లభ్యమైంది. విచారణలో ఆ శరీర భాగాలు చరణ్​వే అని తేలింది. దీంతో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అనుమానితుల్లో చరణ్ భార్య సీమా, ఆమె సోదరిలు బబిత, ప్రియాంకలతో పాటు అదే గ్రామానికి చెందిన భియారామ్ ఉన్నారు.

చరణ్, సీమాలు ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. జులై 11న రాత్రి.. సీమా, తన సోదరి.. చరణ్​ను ఓ ఖాళీ ఫ్లాట్​కు రమ్మన్నారు. అక్కడికి చేరుకున్న చరణ్​కు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన చరణ్ స్ఫృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత భియారామ్ సాయంతో చరణ్ గొంతు నులిమి చంపేశారు. అంతటితో ఆగక.. పదునైన ఆయుధంతో ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఓ గోనె సంచిలో శరీర భాగాలు వేసి.. సమీపంలోని సిమెంట్ ప్లాంట్ వద్ద ఆ సంచిని పడేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు వివరాలను వెల్లడించారు.

"ఓ ఫొరెన్సిక్ బృందాన్ని ఘటనా స్థలానికి పంపించాం. విచారణలో సీమా తానే భర్తను చంపినట్లు అంగీకరించింది. మేము నిందితులను 48 గంటల్లోగా పట్టుకున్నాం. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించాం. నిందితులను విచారిస్తున్నాం. "

-ధర్మేంద్ర యాదవ్, జోధ్​పుర్ డీసీపీ

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: సినీ ఫక్కీలో 'గర్ల్​ ఫ్రెండ్' కిడ్నాప్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.