ETV Bharat / bharat

కరోనా రాపిడ్ టెస్ట్​ కిట్ల వినియోగం బంద్!

author img

By

Published : Apr 21, 2020, 3:40 PM IST

కరోనా నిర్ధరణ పరీక్షా ఫలితాలు వేగంగా వస్తాయని భావిస్తున్న రాపిడ్ టెస్టింగ్ కిట్ల వినియోగాన్ని నిలిపేసింది రాజస్థాన్. కచ్చితమైన ఫలితాలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. నిపుణుల కమిటీ నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. తమ అభిప్రాయాన్ని ఐసీఎంఆర్​కు నివేదించామని స్పష్టం చేసింది.

rapid tests
కరోనా రాపిడ్ టెస్ట్​ కిట్ల వినియోగం నిలిపివేత!

కరోనా వైరస్​ పరీక్ష ఫలితాలను వేగంగా ఇస్తాయని భావిస్తున్న రాపిడ్ టెస్టింగ్ కిట్ల వినియోగంపై నిషేధం విధించింది రాజస్థాన్. ఈ కిట్ల ద్వారా కచ్చితమైన ఫలితాలు రాకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ఈ మేరకు భారత వైద్య పరిశోధనా మండలికి(ఐసీఎంఆర్​) సమాచారం ఇచ్చింది.

రాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా 90 శాతం కచ్చితమైన ఫలితాలు వెలువడతాయన్న అంచనాలు ఉన్నాయని పేర్కొంది ప్రభుత్వం. అయితే అంచనాలకు భిన్నంగా వీటి ద్వారా 5.4 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని స్పష్టం చేసింది. జైపుర్​ ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా నిపుణుల కమిటీ పరీక్ష కిట్ల కచ్చితత్వాన్ని పరిశీలించింది. ఈ కమిటీ సూచనల మేరకు కిట్ల వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.

"ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచన మేరకు మేం రాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించడం ఆపేశాం. ఈ అంశమై ఐసీఎంఆర్​కు లేఖ రాశాం. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది. ఐసీఎంఆర్ నిర్ణయం మాకు అనుకూలంగా వస్తే కిట్లను వెనక్కి పంపించే అవకాశం ఉంది."

-ప్రభుత్వ ప్రకటన

ఈ కిట్ల ద్వారా ఇప్పటికే 168 పరీక్షలు చేశామని వెల్లడించింది ప్రభుత్వం. కరోనా బాధితులకు ఈ టెస్టింగ్ కిట్లద్వారా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. అయితే వారికి వైరస్ నెగిటివ్​గా తేలిందని పేర్కొంది.

బంగాల్​లో..

బంగాల్​లోనూ రాపిడ్ టెస్ట్ కిట్లు సరిగా పనిచేయడం లేదని సోమవారం ఆరోపణలు చేసింది అక్కడి ప్రభుత్వం. వాటి విశ్వసనీయతపై అనుమానాలు లేవనెత్తింది.

ఇదీ చూడండి: విస్తృత పరీక్షలే కరోనా కట్టడికి శరణ్యం!

కరోనా వైరస్​ పరీక్ష ఫలితాలను వేగంగా ఇస్తాయని భావిస్తున్న రాపిడ్ టెస్టింగ్ కిట్ల వినియోగంపై నిషేధం విధించింది రాజస్థాన్. ఈ కిట్ల ద్వారా కచ్చితమైన ఫలితాలు రాకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ఈ మేరకు భారత వైద్య పరిశోధనా మండలికి(ఐసీఎంఆర్​) సమాచారం ఇచ్చింది.

రాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా 90 శాతం కచ్చితమైన ఫలితాలు వెలువడతాయన్న అంచనాలు ఉన్నాయని పేర్కొంది ప్రభుత్వం. అయితే అంచనాలకు భిన్నంగా వీటి ద్వారా 5.4 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని స్పష్టం చేసింది. జైపుర్​ ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా నిపుణుల కమిటీ పరీక్ష కిట్ల కచ్చితత్వాన్ని పరిశీలించింది. ఈ కమిటీ సూచనల మేరకు కిట్ల వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.

"ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచన మేరకు మేం రాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించడం ఆపేశాం. ఈ అంశమై ఐసీఎంఆర్​కు లేఖ రాశాం. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది. ఐసీఎంఆర్ నిర్ణయం మాకు అనుకూలంగా వస్తే కిట్లను వెనక్కి పంపించే అవకాశం ఉంది."

-ప్రభుత్వ ప్రకటన

ఈ కిట్ల ద్వారా ఇప్పటికే 168 పరీక్షలు చేశామని వెల్లడించింది ప్రభుత్వం. కరోనా బాధితులకు ఈ టెస్టింగ్ కిట్లద్వారా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. అయితే వారికి వైరస్ నెగిటివ్​గా తేలిందని పేర్కొంది.

బంగాల్​లో..

బంగాల్​లోనూ రాపిడ్ టెస్ట్ కిట్లు సరిగా పనిచేయడం లేదని సోమవారం ఆరోపణలు చేసింది అక్కడి ప్రభుత్వం. వాటి విశ్వసనీయతపై అనుమానాలు లేవనెత్తింది.

ఇదీ చూడండి: విస్తృత పరీక్షలే కరోనా కట్టడికి శరణ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.