ETV Bharat / bharat

రిఫండ్​ గడువును పొడిగించిన రైల్వే శాఖ

author img

By

Published : Jan 7, 2021, 8:34 PM IST

గతేడాది రద్దయిన రైళ్ల టికెట్లపై రిఫండ్ పొందే గడువును రైల్వే శాఖ 9 నెలలకు పొడిగించింది. ఈ మేరకు గురువారం చేసిన ప్రకటనలో వెల్లడించింది.

indian railway, lockdown
రిఫండ్​ గడువును పొడిగించిన రైల్వే శాఖ

గతేడాది లాక్​డౌన్ కారణంగా రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్​ను పొందే గడువు కేంద్ర రైల్వే శాఖ పొడిగించింది. ప్రస్తుతం ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఉన్న గడువును 9 నెలలకు పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.

"2020 మార్చి 21 నుంచి జూన్​ 7 మధ్య రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్​ పొందే గడువును 9 నెలలకు పొడిగిస్తున్నాము. రోజువారిగా నడిచే రైళ్లకే ఈ రిఫండ్ వర్తిస్తుంది.

ఈ ఆరు నెలల గడువులో ఎంతో మంది రిఫండ్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందరికీ పూర్తి స్థాయిలో రిఫండ్ అందుతుంది."

-రైల్వే శాఖ

కొవిడ్​ దృష్ట్యా కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి : వ్యాక్సిన్​ వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉండండి: కేంద్రం

గతేడాది లాక్​డౌన్ కారణంగా రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్​ను పొందే గడువు కేంద్ర రైల్వే శాఖ పొడిగించింది. ప్రస్తుతం ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఉన్న గడువును 9 నెలలకు పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.

"2020 మార్చి 21 నుంచి జూన్​ 7 మధ్య రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్​ పొందే గడువును 9 నెలలకు పొడిగిస్తున్నాము. రోజువారిగా నడిచే రైళ్లకే ఈ రిఫండ్ వర్తిస్తుంది.

ఈ ఆరు నెలల గడువులో ఎంతో మంది రిఫండ్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందరికీ పూర్తి స్థాయిలో రిఫండ్ అందుతుంది."

-రైల్వే శాఖ

కొవిడ్​ దృష్ట్యా కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి : వ్యాక్సిన్​ వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉండండి: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.