ETV Bharat / bharat

'ఆపరేషన్​ మహా'తో ప్రజాస్వామ్యం ఖూనీ: రాహుల్

author img

By

Published : Nov 25, 2019, 12:15 PM IST

Updated : Nov 25, 2019, 1:19 PM IST

మహారాష్ట్ర వ్యవహారంలో భాజపాకు వ్యతిరేకంగా పార్లమెంటులో విపక్షాలు నిరసనకు దిగాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. లోక్​సభలో ఆరోపించారు.

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
'ఆపరేషన్​ మహా'తో ప్రజాస్వామ్యం ఖూనీ: రాహుల్

మహారాష్ట్ర వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం చెలరేగింది. ప్రారంభమైన కాసేపటికే రెండు సభలూ వాయిదా పడ్డాయి. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని లోక్​సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

"అధ్యక్షా.. నేను ఈ రోజు ప్రశ్నించడానికి వచ్చాను. కానీ ఇక్కడ ప్రశ్నించడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. "

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ నిరసన

రాహుల్ మాట్లాడిన తర్వాత లోక్​సభలో కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సభలో పెద్ద బ్యానర్లను ప్రదర్శించిన కాంగ్రెస్ నేతలు హిబీ ఈదెన్​, టీఎన్​ ప్రతాపన్​ను బయటకు పంపాలని మార్షల్స్​ను ఆదేశించారు స్పీకర్​ ఓం బిర్లా. సభను గంటపాటు వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు తిరిగి ప్రారంభమయినా.. అదే పరిస్థితి కొనసాగింది. ఫలితంగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు ఓం బిర్లా.

రాజ్యసభలోనూ..

రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. వాయిదా తీర్మానం కోసం విపక్షాలు ఇచ్చిన నోటీసులను ఛైర్మన్​ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. సభ కార్యక్రమాలను విపక్ష సభ్యులు అడ్డుకున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

ఇదీ చూడండి: 'మహారాష్ట్ర' వ్యవహారంపై తీర్పు రేపటికి వాయిదా

'ఆపరేషన్​ మహా'తో ప్రజాస్వామ్యం ఖూనీ: రాహుల్

మహారాష్ట్ర వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం చెలరేగింది. ప్రారంభమైన కాసేపటికే రెండు సభలూ వాయిదా పడ్డాయి. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని లోక్​సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

"అధ్యక్షా.. నేను ఈ రోజు ప్రశ్నించడానికి వచ్చాను. కానీ ఇక్కడ ప్రశ్నించడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. "

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ నిరసన

రాహుల్ మాట్లాడిన తర్వాత లోక్​సభలో కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సభలో పెద్ద బ్యానర్లను ప్రదర్శించిన కాంగ్రెస్ నేతలు హిబీ ఈదెన్​, టీఎన్​ ప్రతాపన్​ను బయటకు పంపాలని మార్షల్స్​ను ఆదేశించారు స్పీకర్​ ఓం బిర్లా. సభను గంటపాటు వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు తిరిగి ప్రారంభమయినా.. అదే పరిస్థితి కొనసాగింది. ఫలితంగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు ఓం బిర్లా.

రాజ్యసభలోనూ..

రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. వాయిదా తీర్మానం కోసం విపక్షాలు ఇచ్చిన నోటీసులను ఛైర్మన్​ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. సభ కార్యక్రమాలను విపక్ష సభ్యులు అడ్డుకున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

ఇదీ చూడండి: 'మహారాష్ట్ర' వ్యవహారంపై తీర్పు రేపటికి వాయిదా


Mumbai, Nov 24 (ANI): While speaking to media in Mumbai on November 24, the independent MLA from Maharashtra who is also supporting Bharatiya Janata Party (BJP), Vinay Kore said, "We can see that two factions have been formed in Nationalist Congress Party (NCP). We will get to know through floor test that who has the bigger faction, how many people are with Ajit Pawar, how many with Sharad Pawar."
Last Updated : Nov 25, 2019, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.