ETV Bharat / bharat

పేద రైతులంటే మోదీకి చులకన : రాహుల్

రోజుకు రూ. 3.50 ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేద రైతులను చులకనగా చూస్తున్నారని రాహుల్​గాంధీ విమర్శించారు. పారిశ్రామిక వేత్తలకు మాత్రం రూ. 3.5 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఆరోపించారు.

author img

By

Published : Mar 8, 2019, 7:58 PM IST

రాహుల్​ గాంధీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శల వర్షం కురిపించారు కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ. కిసాన్​ సమ్మాన్​ నిధిలో భాగంగా రోజుకు రూ.3.5 ఇస్తూ రైతులను చులకన చేస్తున్నారని ఆరోపించారు. చత్తీస్​గఢ్​లో గిరిజనులు అధికంగా ఉండే కోరాపుట్​ జిల్లాలో ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. రుణమాఫీ హామీపై మరోసారి స్పష్టతనిచ్చారు.

రాహుల్​ గాంధీ

నరేంద్ర మోదీ 15 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన 3 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారు. వాళ్లంతా దేశంలో ధనికులు. రైతుల రుణమాఫీకి డిమాండ్​ చేస్తే... నరేంద్రమోదీ, నవీన్​ పట్నాయక్​ తిరస్కరించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 రోజుల్లో ప్రతి రైతు రుణం మాఫీ చేస్తాం.
-రాహుల్​గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

ప్రధానమంత్రి స్వయంగా రఫేల్​ ఒప్పందాన్ని తయారుచేసి, సమాంతరంగా చర్చలు జరిపారని దినపత్రికల్లో వచ్చిందన్నారు రాహుల్​. అనిల్​ అంబానీకి కాంట్రాక్టు ఇవ్వాలని మోదీ ఫ్రాన్స్​ను డిమాండ్​ చేశారని ఆరోపించారు.

ప్రధానమంత్రి ఒకవైపు దేశభక్తి గురించి మాట్లాడుతారు. రెండోవైపు వాయుసేన నుంచి డబ్బులు తీసుకొని తన మిత్రుడు అనిల్​ అంబానీకి ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం రఫేల్ విమానాలను ​హెచ్​ఏఎల్​ తయారుచేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక విమానాన్ని 526 కోట్లకు కొనటానికి నిర్ణయించాం. కాపాలాదారు అదే విమానం ధరను రూ.1600 కోట్లకు పెంచారు. అనిల్​ అంబానీకి 30 వేల కోట్లను ఇవ్వటానికే ఈ పెంపుదల. - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

నవీన్​ పట్నాయక్​ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు రాహుల్. రాష్ట్ర ప్రభుత్వం నాలుగైదుగురు అధికారుల చేతుల్లో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పేద యువతుల పెళ్లికి సహాయం, రూ. 2000 వితంతు పింఛన్లు లాంటి పథకాలు తెస్తామని ప్రకటించారు.

ఇదీ చూడండి: 'ఎస్పీ ప్రభుత్వం వల్లే'

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శల వర్షం కురిపించారు కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ. కిసాన్​ సమ్మాన్​ నిధిలో భాగంగా రోజుకు రూ.3.5 ఇస్తూ రైతులను చులకన చేస్తున్నారని ఆరోపించారు. చత్తీస్​గఢ్​లో గిరిజనులు అధికంగా ఉండే కోరాపుట్​ జిల్లాలో ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. రుణమాఫీ హామీపై మరోసారి స్పష్టతనిచ్చారు.

రాహుల్​ గాంధీ

నరేంద్ర మోదీ 15 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన 3 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారు. వాళ్లంతా దేశంలో ధనికులు. రైతుల రుణమాఫీకి డిమాండ్​ చేస్తే... నరేంద్రమోదీ, నవీన్​ పట్నాయక్​ తిరస్కరించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 రోజుల్లో ప్రతి రైతు రుణం మాఫీ చేస్తాం.
-రాహుల్​గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

ప్రధానమంత్రి స్వయంగా రఫేల్​ ఒప్పందాన్ని తయారుచేసి, సమాంతరంగా చర్చలు జరిపారని దినపత్రికల్లో వచ్చిందన్నారు రాహుల్​. అనిల్​ అంబానీకి కాంట్రాక్టు ఇవ్వాలని మోదీ ఫ్రాన్స్​ను డిమాండ్​ చేశారని ఆరోపించారు.

ప్రధానమంత్రి ఒకవైపు దేశభక్తి గురించి మాట్లాడుతారు. రెండోవైపు వాయుసేన నుంచి డబ్బులు తీసుకొని తన మిత్రుడు అనిల్​ అంబానీకి ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం రఫేల్ విమానాలను ​హెచ్​ఏఎల్​ తయారుచేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక విమానాన్ని 526 కోట్లకు కొనటానికి నిర్ణయించాం. కాపాలాదారు అదే విమానం ధరను రూ.1600 కోట్లకు పెంచారు. అనిల్​ అంబానీకి 30 వేల కోట్లను ఇవ్వటానికే ఈ పెంపుదల. - రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

నవీన్​ పట్నాయక్​ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు రాహుల్. రాష్ట్ర ప్రభుత్వం నాలుగైదుగురు అధికారుల చేతుల్లో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పేద యువతుల పెళ్లికి సహాయం, రూ. 2000 వితంతు పింఛన్లు లాంటి పథకాలు తెస్తామని ప్రకటించారు.

ఇదీ చూడండి: 'ఎస్పీ ప్రభుత్వం వల్లే'


Beawar (Rajasthan), Mar 08 (ANI): Union Home Minister Rajnath Singh while addressing a public rally in Rajasthan"s Beawar said, "Want to convey a message to entire country, heard of few incidents against Kashmiri children, Kashmiris will remain our people and I have requested Chief Ministers of all states that to protect and love Kashmiri students."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.