ETV Bharat / bharat

మద్యం విక్రయాలపై ఇకనుంచి 'కొవిడ్​-19' సెస్​!

author img

By

Published : Jun 2, 2020, 6:01 AM IST

ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేస్తుంది ప్రభుత్వం. అమ్మకపు పన్ను, సేవా పన్ను, వ్యాట్​, ఎక్సైజ్​ సుంకం, ఆదాయపు పన్ను, వినోద పన్ను, సర్​ఛార్జీ, స్టాంపు డ్యూటీ, విద్యా సుంకం.. ఇలా చాలా రకాల పన్నులు చూశారు. కానీ, కొవిడ్​-19 పన్ను ఎప్పుడైనా విన్నారా? పంజాబ్​ ప్రభుత్వం తాజాగా మద్యం అమ్మకాలపై కొవిడ్​-19 సెస్​ విధించింది.

COVID cess on liquor
మద్యం విక్రయాలపై 'కొవిడ్​-19' సెస్​!

కరోనా మహమ్మారితో ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఓ కొత్త రకం పన్నును వెలుగులోకి తెచ్చింది పంజాబ్​ ప్రభుత్వం. అదే కొవిడ్​-19 సెస్​. మద్యం అమ్మాకాలపై సోమవారం నుంచి ఈ పన్నును అమలులోకి తెచ్చింది.

మద్యం రకాన్ని బట్టి రూ.2 నుంచి రూ.50 వరకు అదనంగా ఎక్సైజ్​ డ్యూటీ, సెస్​ను విధించింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఏడాదిలో అదనంగా రూ. 145 కోట్ల ఆదాయం సమకూరనుంది.

" కరోనా వైరస్​, లాక్​డౌన్​తో భారీగా ఆదాయ నష్టంతో జూన్​ 1 నుంచి మద్యం అమ్మకాలపై కొవిడ్​ సెస్​ విధించేందుకు నిర్ణయించాం. కరోనాతో రాష్ట్రం రూ.26వేల కోట్ల ఆదాయం కోల్పోయింది. అది 2020-21 ఆర్థిక ఏడాది బడ్జెట్​ రెవెన్యూ అంచనాల్లో 30 శాతం. తప్పనిసరై అదనపు రెవెన్యూ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మే 12న ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అదనపు ఎక్సైజ్​ సుంకం, సెస్​ విధించాలని సూచించింది. అదనపు సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కొవిడ్​-19 సంబంధిత ఖర్చులకే వినియోగిస్తాం."

- అమరిందర్​ సింగ్​, పంజాబ్​ ముఖ్యమంత్రి

ఎల్​-1 లేదా ఎల్​-13 (హోల్​సేల్​ లైసెన్స్) కేంద్రాల నుంచి మద్యం రవాణా చేసేందుకు అనుమతులు ఇచ్చే సమయంలోనే సెస్​ విధించాలని ఎక్సైజ్​, పన్నుల విభాగానికి సూచించారు సింగ్​. మంత్రుల బృందం సిఫార్సుల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మద్యంపైనా ఈ సెస్​ విధించనున్నారు అధికారులు.

కరోనా మహమ్మారితో ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఓ కొత్త రకం పన్నును వెలుగులోకి తెచ్చింది పంజాబ్​ ప్రభుత్వం. అదే కొవిడ్​-19 సెస్​. మద్యం అమ్మాకాలపై సోమవారం నుంచి ఈ పన్నును అమలులోకి తెచ్చింది.

మద్యం రకాన్ని బట్టి రూ.2 నుంచి రూ.50 వరకు అదనంగా ఎక్సైజ్​ డ్యూటీ, సెస్​ను విధించింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఏడాదిలో అదనంగా రూ. 145 కోట్ల ఆదాయం సమకూరనుంది.

" కరోనా వైరస్​, లాక్​డౌన్​తో భారీగా ఆదాయ నష్టంతో జూన్​ 1 నుంచి మద్యం అమ్మకాలపై కొవిడ్​ సెస్​ విధించేందుకు నిర్ణయించాం. కరోనాతో రాష్ట్రం రూ.26వేల కోట్ల ఆదాయం కోల్పోయింది. అది 2020-21 ఆర్థిక ఏడాది బడ్జెట్​ రెవెన్యూ అంచనాల్లో 30 శాతం. తప్పనిసరై అదనపు రెవెన్యూ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మే 12న ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అదనపు ఎక్సైజ్​ సుంకం, సెస్​ విధించాలని సూచించింది. అదనపు సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కొవిడ్​-19 సంబంధిత ఖర్చులకే వినియోగిస్తాం."

- అమరిందర్​ సింగ్​, పంజాబ్​ ముఖ్యమంత్రి

ఎల్​-1 లేదా ఎల్​-13 (హోల్​సేల్​ లైసెన్స్) కేంద్రాల నుంచి మద్యం రవాణా చేసేందుకు అనుమతులు ఇచ్చే సమయంలోనే సెస్​ విధించాలని ఎక్సైజ్​, పన్నుల విభాగానికి సూచించారు సింగ్​. మంత్రుల బృందం సిఫార్సుల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మద్యంపైనా ఈ సెస్​ విధించనున్నారు అధికారులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.