ETV Bharat / bharat

టీవీ చూడొద్దని మందలిస్తే.. ఉరేసుకున్నాడు!

author img

By

Published : Jun 10, 2020, 1:11 PM IST

కరోనా లాక్​డౌన్​తో విద్యాసంస్థలు మూసివేయడం వల్ల పిల్లలు ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో అదేపనిగా టీవీ చూస్తున్న కుమారుడిని మందలించింది అతడి తల్లి. టీవీ ఆపేసింది. అంతే.. ఆవేశానికి లోనైన ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చాడు. మహారాష్ట్రలోని పుణెలో జరిగిందీ ఘటన.

Teenager committed suicide in Pune
టీవీ చూడొద్దని మందలిస్తే.. ఉరేసుకున్నాడు!

మహారాష్ట్ర- పుణెలో దారుణ ఘటన జరిగింది. టీవీ చూస్తున్న ఓ బాలుణ్ని తన తల్లి మందలించింది. దీనిని జీర్ణించుకోలేని ఆ బాలుడు ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబానికి శాశ్వతంగా దూరమైపోయాడు.

ఏం జరిగిందంటే.?

కరోనా తెచ్చిన సెలవులతో.. బిబ్వేవాడీలోని ఆదర్శ్​ చౌల్​ ప్రాంతంలో ఓ 14 ఏళ్ల బాలుడు సుదీర్ఘంగా టీవీకే పరిమితమయ్యాడు. ఇది గమనించిన అతడి తల్లి కోపంతో.. టీవీ ఆపుచేయమంది. అయినా అతడు వినిపించుకోలేదు. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్న ఆ అమ్మ.. కాస్త మందలిస్తూ, తనే టీవీ స్విచ్​ ఆఫ్​​ చేసింది. ఇంతటితో ఆగ్రహానికి లోనై పై గదిలోకి వెళ్లిన బాలుడు.. సీలింగ్​ ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇదీ చదవండి: విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్​.. చివరికి!

మహారాష్ట్ర- పుణెలో దారుణ ఘటన జరిగింది. టీవీ చూస్తున్న ఓ బాలుణ్ని తన తల్లి మందలించింది. దీనిని జీర్ణించుకోలేని ఆ బాలుడు ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబానికి శాశ్వతంగా దూరమైపోయాడు.

ఏం జరిగిందంటే.?

కరోనా తెచ్చిన సెలవులతో.. బిబ్వేవాడీలోని ఆదర్శ్​ చౌల్​ ప్రాంతంలో ఓ 14 ఏళ్ల బాలుడు సుదీర్ఘంగా టీవీకే పరిమితమయ్యాడు. ఇది గమనించిన అతడి తల్లి కోపంతో.. టీవీ ఆపుచేయమంది. అయినా అతడు వినిపించుకోలేదు. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్న ఆ అమ్మ.. కాస్త మందలిస్తూ, తనే టీవీ స్విచ్​ ఆఫ్​​ చేసింది. ఇంతటితో ఆగ్రహానికి లోనై పై గదిలోకి వెళ్లిన బాలుడు.. సీలింగ్​ ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇదీ చదవండి: విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్​.. చివరికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.