ETV Bharat / bharat

ఆటోలో 18 కి.మీ ప్రయాణానికి రూ.4,300 బిల్!

ఉపాధి వెతుక్కుంటూ పుణె వచ్చిన బెంగళూరు ఇంజినీర్​కు టోకరా వేశాడు ఓ ఆటో డ్రైవర్​. పద్దెనిమిది కిలోమీటర్ల ప్రయాణానికి వంద, రెండు వందలు కాదు... ఏకంగా 4,300 రూపాయలు వసూలు చేశాడు.

author img

By

Published : Sep 21, 2019, 1:12 PM IST

Updated : Oct 1, 2019, 10:56 AM IST

ఆటోలో 18 కి.మీ ప్రయాణానికి రూ.4,300 బిల్!

ఉద్యోగం కోసం వచ్చిన ఇంజినీర్​ను బెదిరించి బలవంతంగా 4,300 రూపాయలు వసూలు చేశాడు ఓ ఆటో డ్రైవర్​. ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని ఎరవాడలో చోటు చేసుకుంది.

ఇలా జరిగింది

బెంగళూరు చెందిన ఓ ఇంజినీర్... ఉద్యోగం కోసం శుక్రవారం పుణె వచ్చాడు. ఉదయం ఐదు గంటల సమయంలో కాట్రాజ్​-దెహు రహదారిపై బస్సు దిగాడు. అక్కడి నుంచి తాను చేరుకోవాల్సిన ఎరవాడ ప్రాంతానికి ఆటోరిక్షాలో పయనమయ్యాడు.

గమ్యం చేరుకున్నాక

గమ్యస్థానానికి చేరుకున్నాక ఛార్జీ ఎంత అని అడిగిన ఇంజినీర్... ఆటో డ్రైవర్​ చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నాడు. 18 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 4,300 రూపాయలు చెల్లించాలని చెప్పాడు ఆ డ్రైవర్. ఎందుకింత అని అడిగితే... "రూ.1200 టోల్​ ఛార్జీ కలిపితే అంతే" అన్నాడు.

చెల్లించటానికి నిరాకరించగా ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. అతనితో పాటు ఆటోలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు యువకుడిని బెదిరించారు. నిర్మానుష్య ప్రదేశంలో జరిగిన ఈ ఘటనతో ఇంజినీర్ భయపడ్డాడు. అడిగిన సొమ్ము చెల్లించాడు.

ఆ తరువాత

దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసి దర్జాగా వెళ్లిపోయారు ఆ ఆటో డ్రైవర్​ సహా ఇద్దరు వ్యక్తులు. వెంటనే ఆ విద్యార్థి ఆటో​ నెంబర్​ను​ నమోదు చేసుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి :మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు

ఉద్యోగం కోసం వచ్చిన ఇంజినీర్​ను బెదిరించి బలవంతంగా 4,300 రూపాయలు వసూలు చేశాడు ఓ ఆటో డ్రైవర్​. ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని ఎరవాడలో చోటు చేసుకుంది.

ఇలా జరిగింది

బెంగళూరు చెందిన ఓ ఇంజినీర్... ఉద్యోగం కోసం శుక్రవారం పుణె వచ్చాడు. ఉదయం ఐదు గంటల సమయంలో కాట్రాజ్​-దెహు రహదారిపై బస్సు దిగాడు. అక్కడి నుంచి తాను చేరుకోవాల్సిన ఎరవాడ ప్రాంతానికి ఆటోరిక్షాలో పయనమయ్యాడు.

గమ్యం చేరుకున్నాక

గమ్యస్థానానికి చేరుకున్నాక ఛార్జీ ఎంత అని అడిగిన ఇంజినీర్... ఆటో డ్రైవర్​ చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నాడు. 18 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 4,300 రూపాయలు చెల్లించాలని చెప్పాడు ఆ డ్రైవర్. ఎందుకింత అని అడిగితే... "రూ.1200 టోల్​ ఛార్జీ కలిపితే అంతే" అన్నాడు.

చెల్లించటానికి నిరాకరించగా ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. అతనితో పాటు ఆటోలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు యువకుడిని బెదిరించారు. నిర్మానుష్య ప్రదేశంలో జరిగిన ఈ ఘటనతో ఇంజినీర్ భయపడ్డాడు. అడిగిన సొమ్ము చెల్లించాడు.

ఆ తరువాత

దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసి దర్జాగా వెళ్లిపోయారు ఆ ఆటో డ్రైవర్​ సహా ఇద్దరు వ్యక్తులు. వెంటనే ఆ విద్యార్థి ఆటో​ నెంబర్​ను​ నమోదు చేసుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి :మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు

Ghaziabad (UP), Sep 21 (ANI): Ghaziabad Development Authority (GDA) set up homes for birds in housing societies. They installed towers in housing societies that have wooden boxes for birds to build nests inside them. They built around 60 flats for the birds to live in. These flats are fully-furnished with an add-on swimming pool for birds. GDA took the inspiration from Jaipur and the aim is to increase the population of the birds in urban area.

Last Updated : Oct 1, 2019, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.