ETV Bharat / bharat

భద్రతా దళాల చేతిలో ఇద్దరు ముష్కరుల హతం

author img

By

Published : Oct 10, 2020, 4:59 PM IST

దక్షిణ కశ్మీర్​లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Pulwama encounter
ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో డాదురా ప్రాంతంలో పోలీసులు, సైన్యం, సీఆర్​పీఎఫ్​ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. బలగాలు ప్రతిఘటించాయి.

అయితే, ముష్కరులు ఏ సంస్థకు చెందినవారో గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా సోదాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఒక్కరోజు వ్యవధిలో దక్షిణ కశ్మీర్​లో జరిగిన రెండో ఎన్​కౌంటర్​ ఇది. అంతకుముందు కుల్గామ్​లో జరిగిన మరో ఎన్​కౌంటర్​లోనూ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇదీ చూడండి: భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో డాదురా ప్రాంతంలో పోలీసులు, సైన్యం, సీఆర్​పీఎఫ్​ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. బలగాలు ప్రతిఘటించాయి.

అయితే, ముష్కరులు ఏ సంస్థకు చెందినవారో గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా సోదాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఒక్కరోజు వ్యవధిలో దక్షిణ కశ్మీర్​లో జరిగిన రెండో ఎన్​కౌంటర్​ ఇది. అంతకుముందు కుల్గామ్​లో జరిగిన మరో ఎన్​కౌంటర్​లోనూ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇదీ చూడండి: భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.