ETV Bharat / bharat

'ఆన్​లైన్​ విద్య అందించటం ప్రైవేటు పాఠశాలల బాధ్యత'

author img

By

Published : Sep 19, 2020, 4:51 AM IST

Updated : Sep 19, 2020, 8:57 AM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో డిజిటల్​ తరగతుల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసింది దిల్లీ హైకోర్టు. ఆన్​లైన్​ విద్య అనేది విద్యాహక్కు చట్టం పరిధిలోనిదేనని స్పష్టం చేసింది. చట్టానికి లోబడి ఆన్​లైన్​ తరగతులు అందించటం ప్రైవేటు పాఠశాలల బాధ్యత అని.. కానీ, సామాజిక సేవగానో, స్వచ్ఛందంగానో ఆన్​లైన్​ తరగతులు నిర్వహించటం లేదని పేర్కొంది.

Providing online education during pandemic responsibility of pvt schools
'ఆన్​లైన్​ విద్య అందించటం ప్రైవేటు పాఠశాలల బాధ్యత'

కరోనా మహమ్మారి సమయంలో ఆన్​లైన్​ విద్యపై కీలక వ్యాఖ్యలు చేసింది దిల్లీ హైకోర్టు. ఆన్​లైన్​ విద్య అనేది విద్యాహక్కు చట్టం(ఆర్​టీఈ) పరిధిలోనిదేనని.. అందులో భాగంగానే తమ బాధ్యతగా ఆన్​లైన్​ బోధనను ప్రైవేటు పాఠశాలలు అందిస్తున్నాయి తప్ప.. సామాజిక సేవగానో లేదా స్వచ్ఛందంగానో అందించటం లేదని స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి కారణంగా భౌతిక తరగతులు రద్దయినప్పటికీ.. ఆన్​లైన్​ క్లాసులు నిర్వహిస్తున్న క్రమంలోనే ట్యూషన్​ ఫీజులు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది జస్టిస్​ మన్మోహన్​, జస్టిస్​ సంజీవ్​ నరులాలతో కూడిన ధర్మాసనం. ట్యూషన్​ ఫీజు అనేది విద్య అందించేందుకు చెల్లించాలి కానీ, సీటు కోసం కాదని స్పష్టం చేసింది.

కరోనా లాక్​డౌన్​ సమయంలో ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు విద్యార్థులకు సెల్​ఫోన్​, ట్యాబ్లెట్, లేదా ల్యాప్​టాప్​లను ఉచితంగా అందించేలా కేంద్రం, దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. 'జస్టీస్​ ఫర్​ ఆల్'​ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిల్​ విచారణ సందర్బంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది ధర్మాసనం.

ఈ పిటిషన్​పై 94 పేజీల తీర్పును ఇచ్చింది హైకోర్టు. ఆన్​లైన్​ తరగతుల కోసం పేద విద్యార్థులకు అవసరమైన సామగ్రి, అంతర్జాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఆదేశించింది. అలా చేయకపోవటం వివక్షతో సమానమని, అది డిజిటల్​ వర్ణ వివక్షను సృష్టిస్తుందని పేర్కొంది.

అయితే.. కోర్టు తీర్పును ప్రైవేటు పాఠశాలు వ్యతిరేకించాయి. విద్యా హక్కు చట్టం ఆమోదించినప్పుడు ఒక మహమ్మారి వస్తుందని, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడాన్ని అందులో పేర్కొనలేదని వారించాయి. అందువల్ల ప్రస్తుతం పరిస్థితులకు ఆ తీర్పు వర్తించదని పేర్కొన్నాయి. ఆర్​టీఈ ప్రకారం కేవలం భౌతికంగానే తరగతులు నిర్వహించాలని, డిజిటల్​ తరగతులపై ఎలాంటి నియమాలు లేవని వెల్లడించాయి. ప్రస్తుతం కొన్ని పాఠశాలలు సామజిక దృక్పథంతో స్వచ్ఛందంగా ఆన్​లైన్​ తరగతులు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: 18 విమానాలతో చైనా విన్యాసాలు​.. అమెరికాకు హెచ్చరిక?

కరోనా మహమ్మారి సమయంలో ఆన్​లైన్​ విద్యపై కీలక వ్యాఖ్యలు చేసింది దిల్లీ హైకోర్టు. ఆన్​లైన్​ విద్య అనేది విద్యాహక్కు చట్టం(ఆర్​టీఈ) పరిధిలోనిదేనని.. అందులో భాగంగానే తమ బాధ్యతగా ఆన్​లైన్​ బోధనను ప్రైవేటు పాఠశాలలు అందిస్తున్నాయి తప్ప.. సామాజిక సేవగానో లేదా స్వచ్ఛందంగానో అందించటం లేదని స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి కారణంగా భౌతిక తరగతులు రద్దయినప్పటికీ.. ఆన్​లైన్​ క్లాసులు నిర్వహిస్తున్న క్రమంలోనే ట్యూషన్​ ఫీజులు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది జస్టిస్​ మన్మోహన్​, జస్టిస్​ సంజీవ్​ నరులాలతో కూడిన ధర్మాసనం. ట్యూషన్​ ఫీజు అనేది విద్య అందించేందుకు చెల్లించాలి కానీ, సీటు కోసం కాదని స్పష్టం చేసింది.

కరోనా లాక్​డౌన్​ సమయంలో ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు విద్యార్థులకు సెల్​ఫోన్​, ట్యాబ్లెట్, లేదా ల్యాప్​టాప్​లను ఉచితంగా అందించేలా కేంద్రం, దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. 'జస్టీస్​ ఫర్​ ఆల్'​ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిల్​ విచారణ సందర్బంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది ధర్మాసనం.

ఈ పిటిషన్​పై 94 పేజీల తీర్పును ఇచ్చింది హైకోర్టు. ఆన్​లైన్​ తరగతుల కోసం పేద విద్యార్థులకు అవసరమైన సామగ్రి, అంతర్జాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఆదేశించింది. అలా చేయకపోవటం వివక్షతో సమానమని, అది డిజిటల్​ వర్ణ వివక్షను సృష్టిస్తుందని పేర్కొంది.

అయితే.. కోర్టు తీర్పును ప్రైవేటు పాఠశాలు వ్యతిరేకించాయి. విద్యా హక్కు చట్టం ఆమోదించినప్పుడు ఒక మహమ్మారి వస్తుందని, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడాన్ని అందులో పేర్కొనలేదని వారించాయి. అందువల్ల ప్రస్తుతం పరిస్థితులకు ఆ తీర్పు వర్తించదని పేర్కొన్నాయి. ఆర్​టీఈ ప్రకారం కేవలం భౌతికంగానే తరగతులు నిర్వహించాలని, డిజిటల్​ తరగతులపై ఎలాంటి నియమాలు లేవని వెల్లడించాయి. ప్రస్తుతం కొన్ని పాఠశాలలు సామజిక దృక్పథంతో స్వచ్ఛందంగా ఆన్​లైన్​ తరగతులు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: 18 విమానాలతో చైనా విన్యాసాలు​.. అమెరికాకు హెచ్చరిక?

Last Updated : Sep 19, 2020, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.