ETV Bharat / bharat

వార్​ మ్యూజియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి - జనరల్ తిమ్మయ్య

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ కర్ణాటకలోని సన్నిసైడ్​ వార్​ మ్యూజియాన్ని ప్రారంభించారు. జనరల్ తిమ్మయ్య స్మారకంగా నిర్మించిన ఈ ప్రదర్శనశాలలో యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, సైనికులు వినియోగించిన ఆయుధాలు కొలువుతీరాయి.

kovind, karnataka, war museum
కొడగు వార్​ మ్యూజియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
author img

By

Published : Feb 6, 2021, 7:50 PM IST

కర్ణాటకలోని కొడగు జిల్లా మడికేరిలో సన్నిసైడ్​ వార్​ మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శనివారం ప్రారంభించారు. మాజీ సైన్యాధిపతి​ కొడండెర సుబ్బయ్య తిమ్మయ్య స్మారకంగా ఈ మ్యూజియాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఇందులో సైనికుల ఆయుధాలు, మిలిటరీ యూనిఫార్మ్​లు, ఓ యుద్ధ ట్యాంక్, సూపర్​సోనిక్​ యుద్ధ విమానం, ఎంఐజీ-21 యుద్ధ విమానాలను ప్రదర్శనకు ఉంచారు.

kovind, karnataka, war museum
మ్యూజియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
kovind, karnataka, war museum
మ్యూజియంను ప్రారంభిస్తోన్న రాష్ట్రపతి
kovind, karnataka, war museum
జ్యోతి ప్రజ్వలన చేస్తోన్న రాష్ట్రపతి
kovind, karnataka, war museum
జనరల్​ తిమ్మయ్య యూనిఫార్మ్​ను తిలకిస్తోన్న రాష్ట్రపతి కోవింద్​ దంపతులు
kovind, karnataka, war museum
ఆయుధాలను తిలకిస్తూ..
kovind, karnataka, war museum
సన్నిసైడ్​ వార్​ మ్యూజియంలో రాష్ట్రపతి
kovind, karnataka, war museum
సన్నిసైడ్​ మ్యూజియంలో రాష్ట్రపతి సంతకం
kovind, karnataka, war museum
నివాళులు అర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్

ఇంటినే మ్యూజియంగా..

జనరల్​ తిమ్మయ్య స్వగృహాన్నే రాష్ట్ర ప్రభుత్వం మ్యూజియంగా మార్చింది. ప్రవేశంలో స్వాగతిస్తున్నట్లుగా సైనిక దుస్తుల్లో ఉన్న జనరల్ తిమ్మయ్య విగ్రహం ఉంటుంది. 1971 భారత్-​ పాకిస్థాన్​ యుద్ధంలో సైన్యం వినియోగించిన యుద్ధ ట్యాంక్​ ప్రదర్శనశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జనరల్​ తిమ్మయ్య 1957 నుంచి 1961 మధ్య సైన్యానికి చీఫ్​గా సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి సహా ఆయన సతీమణి సవితా కోవింద్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్​ సహా పలువురు అధికారులు, నేతలు హాజరయ్యారు. ​

ఇదీ చదవండి : ఉద్ధృతంగా చక్కా జామ్- పలు చోట్ల రైతుల నిర్బంధం

కర్ణాటకలోని కొడగు జిల్లా మడికేరిలో సన్నిసైడ్​ వార్​ మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శనివారం ప్రారంభించారు. మాజీ సైన్యాధిపతి​ కొడండెర సుబ్బయ్య తిమ్మయ్య స్మారకంగా ఈ మ్యూజియాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఇందులో సైనికుల ఆయుధాలు, మిలిటరీ యూనిఫార్మ్​లు, ఓ యుద్ధ ట్యాంక్, సూపర్​సోనిక్​ యుద్ధ విమానం, ఎంఐజీ-21 యుద్ధ విమానాలను ప్రదర్శనకు ఉంచారు.

kovind, karnataka, war museum
మ్యూజియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
kovind, karnataka, war museum
మ్యూజియంను ప్రారంభిస్తోన్న రాష్ట్రపతి
kovind, karnataka, war museum
జ్యోతి ప్రజ్వలన చేస్తోన్న రాష్ట్రపతి
kovind, karnataka, war museum
జనరల్​ తిమ్మయ్య యూనిఫార్మ్​ను తిలకిస్తోన్న రాష్ట్రపతి కోవింద్​ దంపతులు
kovind, karnataka, war museum
ఆయుధాలను తిలకిస్తూ..
kovind, karnataka, war museum
సన్నిసైడ్​ వార్​ మ్యూజియంలో రాష్ట్రపతి
kovind, karnataka, war museum
సన్నిసైడ్​ మ్యూజియంలో రాష్ట్రపతి సంతకం
kovind, karnataka, war museum
నివాళులు అర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్

ఇంటినే మ్యూజియంగా..

జనరల్​ తిమ్మయ్య స్వగృహాన్నే రాష్ట్ర ప్రభుత్వం మ్యూజియంగా మార్చింది. ప్రవేశంలో స్వాగతిస్తున్నట్లుగా సైనిక దుస్తుల్లో ఉన్న జనరల్ తిమ్మయ్య విగ్రహం ఉంటుంది. 1971 భారత్-​ పాకిస్థాన్​ యుద్ధంలో సైన్యం వినియోగించిన యుద్ధ ట్యాంక్​ ప్రదర్శనశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జనరల్​ తిమ్మయ్య 1957 నుంచి 1961 మధ్య సైన్యానికి చీఫ్​గా సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి సహా ఆయన సతీమణి సవితా కోవింద్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్​ సహా పలువురు అధికారులు, నేతలు హాజరయ్యారు. ​

ఇదీ చదవండి : ఉద్ధృతంగా చక్కా జామ్- పలు చోట్ల రైతుల నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.