ETV Bharat / bharat

దేశ ఆరోగ్య రంగం పటిష్ఠం: రాష్ట్రపతి

author img

By

Published : Feb 7, 2021, 2:05 PM IST

దేశంలో ఆరోగ్య రంగం అన్నిరకాల సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ స్పష్టం చేశారు. బెంగళూరులోని రాజీవ్​గాంధీ హెల్త్ సైన్సెస్​ విశ్వవిద్యాలయ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు.

president ram nath kovind tells indias healthcare system has improved alot and is ready to take challenges of pandemic
'దేశ ఆరోగ్య రంగం పటిష్ఠం'

దేశ ఆరోగ్య రంగం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ తెలిపారు. ఆరోగ్యరంగ సేవల విస్తరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని అభిలషించారు. రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయ 23వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు.

భారతదేశం ఆరోగ్య సంరక్షణలో కీలక మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని కోవింద్​ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం సరైన పాఠాలు నేర్చుకుందని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులు, పారామెడికల్​ సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందన్నారు.

"భారతదేశంలో ఆరోగ్యసేవలు మరింత విస్తృతం అవుతాయి. రోగ నిర్దరణ, నివారణ, చికిత్సల్లో మార్పులు రాబోతున్నాయి. మహమ్మారుల విజృంభణ సమయాల్లో తలెత్తే ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కరోనా హెచ్చరించింది."

-రామ్​నాథ్​ కోవింద్, రాష్ట్రపతి

ఆర్​జీహెచ్ఎస్​యూ సేవలు గర్వకారణం..

రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయ(ఆర్​జీహెచ్ఎస్​యూ) వైద్యులు, నర్సుల బృందం చేసిన సేవలను రామ్​నాథ్​ కొనియాడారు. సుమారు రెండు లక్షల మంది ఆరోగ్య​ నిపుణులు దీని ద్వారా శిక్షణ పొందారని తెలిసి సంతోషించానన్నారు. ఆత్మ నిర్భర్ భారత్​లో ప్రపంచానికి కరోనా టీకా అందించామని రామ్​నాథ్​ తెలిపారు. ఇతర దేశాలకు అందిస్తూ అండగా నిలుస్తున్నామని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: వార్​ మ్యూజియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

దేశ ఆరోగ్య రంగం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ తెలిపారు. ఆరోగ్యరంగ సేవల విస్తరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు జరగాలని అభిలషించారు. రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయ 23వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు.

భారతదేశం ఆరోగ్య సంరక్షణలో కీలక మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని కోవింద్​ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం సరైన పాఠాలు నేర్చుకుందని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో సేవలందించిన వైద్యులు, పారామెడికల్​ సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందన్నారు.

"భారతదేశంలో ఆరోగ్యసేవలు మరింత విస్తృతం అవుతాయి. రోగ నిర్దరణ, నివారణ, చికిత్సల్లో మార్పులు రాబోతున్నాయి. మహమ్మారుల విజృంభణ సమయాల్లో తలెత్తే ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కరోనా హెచ్చరించింది."

-రామ్​నాథ్​ కోవింద్, రాష్ట్రపతి

ఆర్​జీహెచ్ఎస్​యూ సేవలు గర్వకారణం..

రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయ(ఆర్​జీహెచ్ఎస్​యూ) వైద్యులు, నర్సుల బృందం చేసిన సేవలను రామ్​నాథ్​ కొనియాడారు. సుమారు రెండు లక్షల మంది ఆరోగ్య​ నిపుణులు దీని ద్వారా శిక్షణ పొందారని తెలిసి సంతోషించానన్నారు. ఆత్మ నిర్భర్ భారత్​లో ప్రపంచానికి కరోనా టీకా అందించామని రామ్​నాథ్​ తెలిపారు. ఇతర దేశాలకు అందిస్తూ అండగా నిలుస్తున్నామని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: వార్​ మ్యూజియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.