ETV Bharat / bharat

కరోనాపై కేంద్రం అప్రమత్తం.. 5400 పడకల ఏర్పాటుకు ఆదేశం - కరోనాపై కేంద్రం అప్రమత్తం

భారత్​లో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 75 ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నిర్బంధ కేంద్రాల్లో 5400 పడకలను సిద్ధం చేయాలని ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.

Prepare 5,400 bedded quarantine facilities across India: Home Ministry
కరోనాపై కేంద్రం అప్రమత్తం.. 5400 పడకల ఏర్పాటుకు ఆదేశం
author img

By

Published : Mar 10, 2020, 3:15 PM IST

భారత్​లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్​ను కట్టడి చేసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేసింది కేంద్రం. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 75 ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌) సిబ్బందితో పాటు అన్ని భద్రతా దళాలను ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. ఈ కేంద్రాల్లో 5400 పడకలను సిద్ధం చేయాలని సూచించారు.

ప్రధానంగా సరిహద్దు ప్రాంతాలతోపాటు మొత్తం 37 చోట్ల నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఏపీఎఫ్​ సిబ్బందిని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాంతక వైరస్​ ఎక్కువగా విదేశీయుల నుంచి సంక్రమిస్తున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్న సైనికులు.. విదేశీయులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అన్ని భద్రతా దళాలు తమ జవాన్ల​కు కరోనాపై అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారులు వెల్లడించారు.

కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పటికే ఇండో-టిబెటన్​ సరిహద్దు పోలీసులు.. దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 400 మంది చికిత్స పొందుతున్నారు. మానేసర్​​ ప్రాంతంలోనూ సైన్యం ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందిస్తోంది.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు సింధియా గుడ్​బై- భాజపాలో చేరినట్లేనా?

భారత్​లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్​ను కట్టడి చేసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేసింది కేంద్రం. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 75 ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌) సిబ్బందితో పాటు అన్ని భద్రతా దళాలను ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. ఈ కేంద్రాల్లో 5400 పడకలను సిద్ధం చేయాలని సూచించారు.

ప్రధానంగా సరిహద్దు ప్రాంతాలతోపాటు మొత్తం 37 చోట్ల నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఏపీఎఫ్​ సిబ్బందిని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాంతక వైరస్​ ఎక్కువగా విదేశీయుల నుంచి సంక్రమిస్తున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఉన్న సైనికులు.. విదేశీయులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అన్ని భద్రతా దళాలు తమ జవాన్ల​కు కరోనాపై అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారులు వెల్లడించారు.

కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పటికే ఇండో-టిబెటన్​ సరిహద్దు పోలీసులు.. దిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 400 మంది చికిత్స పొందుతున్నారు. మానేసర్​​ ప్రాంతంలోనూ సైన్యం ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందిస్తోంది.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు సింధియా గుడ్​బై- భాజపాలో చేరినట్లేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.