ETV Bharat / bharat

కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

author img

By

Published : Apr 9, 2020, 11:06 AM IST

పొట్టకూటి కోసం ఊరు కాని ఊరికి వెళ్తే.. లాక్​డౌన్​ కారణంగా పని లేదు పొమ్మన్నాడు ఓ కాంట్రాక్టర్​. చేసేదేమీ లేక కేరళ నుంచి దాదాపు 142 కి.మీ నడిచి సొంత రాష్ట్రం కర్ణాటకకు చేరుకుంది ఆ నిండు గర్భణి.

pregnant women are walked with their seven companions for 142 km. from kerala kannur to karnataka mangalore
కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి దిగజార్చుతోంది. కర్ణాటక మంగళూరుకు చెందిన వలస కార్మికులూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్వగ్రమానికి చేరేందుకు నిండు గర్భిణిని వెంటబెట్టుకుని దాదాపు 142కి.మీ కాలినడకన ప్రయాణించారు.

బిజాపుర్ జిల్లా​కు చెందిన ఎనిమిది మంది కార్మికులు కేరళ కన్నూరులో భవన నిర్మాణ పని దొరికిందని ఆనందంగా వెళ్లారు. కానీ, అంతలోనే ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది. పనిలోకి రమ్మన్న కాంట్రాక్టరే.. ఇక్కడ పని లేదు వెళ్లిపొమ్మన్నాడు. గత్యంతరం లేక, ఊరెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, రవాణా సౌకర్యం లేదు, తప్పని పరిస్థితుల్లో నడక మొదలెట్టారు. వారిలో ఓ నిండు చూలాలు కూడా ఉంది.

pregnant women are walked with their seven companions for 142 km. from kerala kannur to karnataka mangalore
కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

దారిలో కొందరు దయతలచి ఇచ్చిన ఆహారంతో గర్భిణి ఆకలి తీరుస్తూ.. నాలుగు రోజుల పాటు నడిచి మంగళూరు చేరుకున్నారు. కార్మికుల రక్షణ పట్టించుకోకుండా, అర్థంతరంగా వారిని గ్రామాలకు వెళ్లిపొమ్మన్న కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే కేరళ నుంచి వచ్చిన ఆ ఎనిమిది మంది కరోనా పరీక్షలు చేయించుకోలేదని మరికొందరు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే వారికి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:పోలీసు విచారణకు తబ్లీగీ జమాత్‌ అధినేత

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి దిగజార్చుతోంది. కర్ణాటక మంగళూరుకు చెందిన వలస కార్మికులూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్వగ్రమానికి చేరేందుకు నిండు గర్భిణిని వెంటబెట్టుకుని దాదాపు 142కి.మీ కాలినడకన ప్రయాణించారు.

బిజాపుర్ జిల్లా​కు చెందిన ఎనిమిది మంది కార్మికులు కేరళ కన్నూరులో భవన నిర్మాణ పని దొరికిందని ఆనందంగా వెళ్లారు. కానీ, అంతలోనే ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది. పనిలోకి రమ్మన్న కాంట్రాక్టరే.. ఇక్కడ పని లేదు వెళ్లిపొమ్మన్నాడు. గత్యంతరం లేక, ఊరెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, రవాణా సౌకర్యం లేదు, తప్పని పరిస్థితుల్లో నడక మొదలెట్టారు. వారిలో ఓ నిండు చూలాలు కూడా ఉంది.

pregnant women are walked with their seven companions for 142 km. from kerala kannur to karnataka mangalore
కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

దారిలో కొందరు దయతలచి ఇచ్చిన ఆహారంతో గర్భిణి ఆకలి తీరుస్తూ.. నాలుగు రోజుల పాటు నడిచి మంగళూరు చేరుకున్నారు. కార్మికుల రక్షణ పట్టించుకోకుండా, అర్థంతరంగా వారిని గ్రామాలకు వెళ్లిపొమ్మన్న కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే కేరళ నుంచి వచ్చిన ఆ ఎనిమిది మంది కరోనా పరీక్షలు చేయించుకోలేదని మరికొందరు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే వారికి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:పోలీసు విచారణకు తబ్లీగీ జమాత్‌ అధినేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.