ETV Bharat / bharat

దూబే కోసం ముమ్మర వేట- ముగ్గురు పోలీసులపై వేటు

author img

By

Published : Jul 6, 2020, 4:05 PM IST

8 మంది పోలీసుల ప్రాణాలు పోయేందుకు కారణమైన వికాస్​ దూబే కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు. అతనితో సంబంధాలు ఉన్న ముగ్గురు పోలీసులను సస్పెండ్​ చేశారు. దూబే ఆచూకీ చెప్పినవారికి ఇచ్చే రివార్డును రూ.2.5 లక్షలకు పెంచారు.

Vikas Dubey
టోల్​ప్లాజాల వద్ద రౌడీషీటర్​ వికాస్​ దూబే పోస్టర్లు

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో పేరుమోసిన గ్యాంగ్​స్టర్, 8 మంది పోలీసుల ప్రాణాలు పోయేందుకు కారణమైన రౌడీషీటర్ వికాస్ దూబే చట్టు ఉచ్చుబిగిస్తున్నారు అధికారులు. దూబేను పట్టుకునేందుకు 25 బృందాలను రంగంలోకి దించి గాలింపు ముమ్మరం చేశారు. అతనితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులపై వేటు వేశారు.

"గ్యాంగ్​స్టర్​ను పట్టుకునేందుకు 40 పోలీస్​ స్టేషన్ల నుంచి 25 బృందాలను రంగంలోకి దించాం. కొన్ని టీంలు ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. త్వరలోనే దూబేను అరెస్ట్​ చేస్తాం. దూబేతో సంబంధం ఉన్న కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్​ చేశాం."

- మోహిత్​ అగర్వాల్​, ఐజీ, కన్పూర్​ రేంజ్​

రివార్డు 2.5 లక్షలకు పెంపు..

కాన్పుర్​ ఎన్​కౌంటర్​లో ప్రధాన నిందితుడు వికాస్​ దూబే గురించి సమాచారం అందిస్తే రూ. 50,000 రివార్డు అందిస్తామని తొలుత ప్రకటించిన పోలీసులు.. తాజాగా ఆ నజరానాను రూ. 2.5 లక్షలకు పెంచారు.

టోల్​ప్లాజాల వద్ద పోస్టర్లు..

గాలింపు చర్యల్లో భాగంగా యూపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్​ప్లాజాల వద్ద దూబే పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఐజీ. దూబే సన్నిహితులపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.

ఈనెల 3న జరిగిన రౌడీషీటర్ల దాడిలో ఓ డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఓ పౌరుడు సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చూడండి: దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో పేరుమోసిన గ్యాంగ్​స్టర్, 8 మంది పోలీసుల ప్రాణాలు పోయేందుకు కారణమైన రౌడీషీటర్ వికాస్ దూబే చట్టు ఉచ్చుబిగిస్తున్నారు అధికారులు. దూబేను పట్టుకునేందుకు 25 బృందాలను రంగంలోకి దించి గాలింపు ముమ్మరం చేశారు. అతనితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులపై వేటు వేశారు.

"గ్యాంగ్​స్టర్​ను పట్టుకునేందుకు 40 పోలీస్​ స్టేషన్ల నుంచి 25 బృందాలను రంగంలోకి దించాం. కొన్ని టీంలు ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. త్వరలోనే దూబేను అరెస్ట్​ చేస్తాం. దూబేతో సంబంధం ఉన్న కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్​ చేశాం."

- మోహిత్​ అగర్వాల్​, ఐజీ, కన్పూర్​ రేంజ్​

రివార్డు 2.5 లక్షలకు పెంపు..

కాన్పుర్​ ఎన్​కౌంటర్​లో ప్రధాన నిందితుడు వికాస్​ దూబే గురించి సమాచారం అందిస్తే రూ. 50,000 రివార్డు అందిస్తామని తొలుత ప్రకటించిన పోలీసులు.. తాజాగా ఆ నజరానాను రూ. 2.5 లక్షలకు పెంచారు.

టోల్​ప్లాజాల వద్ద పోస్టర్లు..

గాలింపు చర్యల్లో భాగంగా యూపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్​ప్లాజాల వద్ద దూబే పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఐజీ. దూబే సన్నిహితులపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.

ఈనెల 3న జరిగిన రౌడీషీటర్ల దాడిలో ఓ డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఓ పౌరుడు సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చూడండి: దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.