ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్ర దుశ్చర్యలకు పాక్​ విశ్వప్రయత్నాలు

ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్​లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు పాకిస్థాన్ అనేక సార్లు ప్రయత్నించిందని సీనియర్ భద్రతా అధికారి తెలిపారు. ఆగస్టు 21న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను నియంత్రణ రేఖ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

author img

By

Published : Sep 4, 2019, 9:13 PM IST

Updated : Sep 29, 2019, 11:16 AM IST

కశ్మీర్​లో ఉగ్ర దుశ్చర్యలకు పాక్​ విశ్వప్రయత్నాలు

కశ్మీర్ ​లోయలోకి ఉగ్రవాదులు చొరబడేలా చేసేందుకు పాకిస్థాన్​ విశ్వప్రయత్నాలు చేసిందని భారత సైన్యాధికారి వెల్లడించారు. ఆర్టికల్​ 370 రద్దయిన ఆగస్టు 5 తర్వాత ఈ ప్రయత్నాలను మరింత పెంచిందని తెలిపారు. కశ్మీర్​లోకి చొరబాటుకు యత్నించిన ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు తమ అదుపులో ఉన్నట్లు సైన్యాధికారి కేజేఎస్​ డిల్లాన్ చెప్పారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మార్గాల ద్వారా ముష్కరులు చొరబడేందుకు ఆ దేశ సైన్యం ఏర్పాట్లు చేసిందని భారత సైన్యాధికారి పేర్కొన్నారు. తమ అధీనంలో ఉన్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వద్ద పట్టుబడినట్లు వివరించారు. కశ్మీర్​లో దాడులు నిర్వహించేందుకు పాక్ సైన్యమే తమని పంపిందని పట్టుబడ్డ మహ్మద్ ఖలీల్, మహ్మద్ నజీం వెల్లడించారని డిల్లాన్ తెలిపారు. వీరిద్దరూ లష్కరే తోయిబా సంస్థలో శిక్షణ తీసుకున్నారని, పాక్ సైన్యం కూడా వీరికి శిక్షణ ఇచ్చి భారత్​పైకి ఉసిగొల్పిందన్నారు. రావల్పిండికి చెందిన వీరు మరికొంత మంది సహచరుల పేర్లను వెల్లడించినట్లు డిల్లాన్​ చెప్పారు.

ఆగస్టు 21న గుల్మార్గ్​ సెక్టార్​లో నియంత్రణ రేఖ వద్ద అదుపులోకి తీసుకున్న ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు అధికారులు. వీడియోలో 'టీ' ఎలా ఉందని ఉగ్రవాదిని అధికారులు అడగ్గా... బాగుందని బదులిచ్చాడు. కశ్మీర్​ లోయలో దాడులు నిర్వహించేందుకే తమను పంపారని ఒప్పుకున్నారు ఖలీల్, నజీం.


ఇదీ చూడండి: హోంమంత్రి అమిత్​ షాకు శస్త్రచికిత్స

కశ్మీర్ ​లోయలోకి ఉగ్రవాదులు చొరబడేలా చేసేందుకు పాకిస్థాన్​ విశ్వప్రయత్నాలు చేసిందని భారత సైన్యాధికారి వెల్లడించారు. ఆర్టికల్​ 370 రద్దయిన ఆగస్టు 5 తర్వాత ఈ ప్రయత్నాలను మరింత పెంచిందని తెలిపారు. కశ్మీర్​లోకి చొరబాటుకు యత్నించిన ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు తమ అదుపులో ఉన్నట్లు సైన్యాధికారి కేజేఎస్​ డిల్లాన్ చెప్పారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మార్గాల ద్వారా ముష్కరులు చొరబడేందుకు ఆ దేశ సైన్యం ఏర్పాట్లు చేసిందని భారత సైన్యాధికారి పేర్కొన్నారు. తమ అధీనంలో ఉన్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వద్ద పట్టుబడినట్లు వివరించారు. కశ్మీర్​లో దాడులు నిర్వహించేందుకు పాక్ సైన్యమే తమని పంపిందని పట్టుబడ్డ మహ్మద్ ఖలీల్, మహ్మద్ నజీం వెల్లడించారని డిల్లాన్ తెలిపారు. వీరిద్దరూ లష్కరే తోయిబా సంస్థలో శిక్షణ తీసుకున్నారని, పాక్ సైన్యం కూడా వీరికి శిక్షణ ఇచ్చి భారత్​పైకి ఉసిగొల్పిందన్నారు. రావల్పిండికి చెందిన వీరు మరికొంత మంది సహచరుల పేర్లను వెల్లడించినట్లు డిల్లాన్​ చెప్పారు.

ఆగస్టు 21న గుల్మార్గ్​ సెక్టార్​లో నియంత్రణ రేఖ వద్ద అదుపులోకి తీసుకున్న ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు అధికారులు. వీడియోలో 'టీ' ఎలా ఉందని ఉగ్రవాదిని అధికారులు అడగ్గా... బాగుందని బదులిచ్చాడు. కశ్మీర్​ లోయలో దాడులు నిర్వహించేందుకే తమను పంపారని ఒప్పుకున్నారు ఖలీల్, నజీం.


ఇదీ చూడండి: హోంమంత్రి అమిత్​ షాకు శస్త్రచికిత్స

Vladivostok (Russia), Sep 04 (ANI): Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin reached Zvezda ship-building plant for tour. Massive Ship-building complex was developed to enhance production capacity of existing shipyard in Bolshoi Kamen town. PM Narendra Modi is in Russia as the chief guest of the 5th Eastern Economic Forum. PM Modi will also take part in the 20th India-Russia Annual Summit and hold bilateral talks with President Vladimir Putin. During the visit, the Prime Minister is scheduled to hold talks with Russian President Vladimir Putin in which the two leaders will discuss bilateral, regional, and international issues of mutual interest. Following this, the two sides will sign agreements in the fields of defence, trade, investments, industrial cooperation, energy and connectivity corridors.
Last Updated : Sep 29, 2019, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.