కేరళ త్రిస్సూర్ జిల్లాలో చాక్లెట్ను తలపించే మట్టా రైస్ పండించి.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు ఊమంగళం గ్రామానికి చెందిన రైతులు.
మొన్నటిదాకా.. పూమంగళం అంటే త్రిస్సూర్ జిల్లాలోని ఓ చిన్న గ్రామ పంచాయతీ మాత్రమే. కానీ, వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకుని, నేలమ్మపై అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్న కొందరు రైతులు ఆ గ్రామానికే పేరు తెచ్చారు. హరిత కర్మ సేన పేరిట ఓ బృందంగా ఏర్పడి.. మునుట్టి అగ్రికల్చరల్ వర్సిటీలో సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ పొందారు. అక్కడే అచ్చం చాక్లెట్ వాసన, రుచి, రంగు కలిగిన మట్టా రైస్ గురించి తెలుసుకున్నారు.
శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ.. పడియూర్ కోలె తేమ నేలల్లో మట్టా వరిని సాగు చేశారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా.. కేవలం నేలమ్మను నమ్మి ఓపికగా పంట పండించారు. ఇంకేముంది... పూమంగళం మట్టా రైస్ ప్రపంచమంతా ఫేమస్ అయిపోయింది.
ఎన్నో ఔషధ గుణాలున్న ఈ చాకో రైస్కు కేరళవాసులు ఫిదా అవుతున్నారు. కేవలం మట్టా బియ్యాన్నే కాక, మట్టా బియ్యం పిండి, మట్టా అటుకులూ తయారు చేసి కేరళ వ్యాప్తంగా విక్రయిస్తున్నారు రైతులు. ప్రభుత్వం ధ్రువీకరించిన తర్వాత, గ్రామ చుట్టుపక్కల బీడుగా పడున్న భూముల్లోనూ ఈ చాక్లెట్ లాంటి మట్టా రైస్ పండిస్తామంటున్నారు.
ఇదీ చదవండి: విత్తనం విలువ తెలిసిన మగువా.. ఆలోచన వారెవ్వా!