ETV Bharat / bharat

నవంబర్​ 9న మోదీ చేతుల మీదుగా కర్తార్​పుర్​ ప్రారంభం

author img

By

Published : Nov 1, 2019, 5:41 AM IST

Updated : Nov 1, 2019, 8:24 AM IST

ప్రతిష్ఠాత్మక కర్తార్​పుర్​ నడవాను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్​ 9న ప్రారంభించనున్నారు. పంజాబ్​లో ఉన్న డేరాబాబా నానక్​ వద్ద ఆర్ట్​ పాసింజర్​ టెర్మినల్​ భవనాన్ని మోదీ ప్రారంభిస్తారు. ప్రతిపాదిత కారిడార్​ పాకిస్థాన్​ కర్తార్​పుర్​లోని దర్బార్ ​సాహిబ్​ను, పంజాబ్ గురుదాస్​పుర్​ జిల్లాలో గల బాబా నానక్​ మందిరంతో కలుపుతుంది.

నవంబర్​ 9న మోదీ చేతుల మీదుగా కర్తార్​పుర్​ ప్రారంభం
నవంబర్​ 9న మోదీ చేతుల మీదుగా కర్తార్​పుర్​ ప్రారంభం

దాయాది దేశాల మధ్య ఆధ్యాత్మిక వారధిగా చెబుతున్న కర్తార్​పుర్​ నడవా​ను నవంబర్​ 9న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పంజాబ్​ డేరా బాబా నానక్​ వద్ద ఆర్ట్​ పాసింజర్​ టెర్మినల్​ భవనాన్ని (పీటీబీ) మోదీ ప్రారంభిస్తారు. అనంతరం 3 కి.మీ దగ్గరలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సుల్తాన్​పుర్​ లోధీలో నిర్వహించే గురునానక్​ 550వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు మోదీ.

సిక్కు మత స్థాపకుడు గురునానక్​ దేవ్ 18 ఏళ్లకు పైగా పాకిస్థాన్​ కర్తార్​పుర్​లో రావి నది తీరంలో ఉన్న దర్బార్​ సాహిబ్​ గురుద్వారాలో జీవినం సాగించారు. అందుకే ఈ ప్రాంతాన్ని సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

ప్రతిపాదిత కారిడార్​ పాకిస్థాన్​ కర్తార్​పుర్​లోని దర్బార్​ సాహిబ్​ను, పంజాబ్ గురుదాస్​పుర్​ జిల్లాలో గల బాబా నానక్​ మందిరంతో కలుపుతుంది. ఫలితంగా ప్రతిరోజూ సుమారు 5వేల మంది భారతీయ సిక్కు భక్తులు, యాత్రికులు వీసాలేకుండానే పాక్​లోని పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం కలుగుతుంది.

మోదీ ప్రారంభించనున్న ఈ పీటీబీలో మొత్తం 55 ఇమ్మిగ్రేషన్​ కౌంటర్లు ఉంటాయి. వీసా అవసరం లేకపోయినప్పటికీ యాత్రికులు పాస్​పోర్ట్​ను మాత్రం వారి వద్ద ఉంచుకోవాలి.

నవంబర్​ 9న మోదీ చేతుల మీదుగా కర్తార్​పుర్​ ప్రారంభం

దాయాది దేశాల మధ్య ఆధ్యాత్మిక వారధిగా చెబుతున్న కర్తార్​పుర్​ నడవా​ను నవంబర్​ 9న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పంజాబ్​ డేరా బాబా నానక్​ వద్ద ఆర్ట్​ పాసింజర్​ టెర్మినల్​ భవనాన్ని (పీటీబీ) మోదీ ప్రారంభిస్తారు. అనంతరం 3 కి.మీ దగ్గరలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సుల్తాన్​పుర్​ లోధీలో నిర్వహించే గురునానక్​ 550వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు మోదీ.

సిక్కు మత స్థాపకుడు గురునానక్​ దేవ్ 18 ఏళ్లకు పైగా పాకిస్థాన్​ కర్తార్​పుర్​లో రావి నది తీరంలో ఉన్న దర్బార్​ సాహిబ్​ గురుద్వారాలో జీవినం సాగించారు. అందుకే ఈ ప్రాంతాన్ని సిక్కులు పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

ప్రతిపాదిత కారిడార్​ పాకిస్థాన్​ కర్తార్​పుర్​లోని దర్బార్​ సాహిబ్​ను, పంజాబ్ గురుదాస్​పుర్​ జిల్లాలో గల బాబా నానక్​ మందిరంతో కలుపుతుంది. ఫలితంగా ప్రతిరోజూ సుమారు 5వేల మంది భారతీయ సిక్కు భక్తులు, యాత్రికులు వీసాలేకుండానే పాక్​లోని పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం కలుగుతుంది.

మోదీ ప్రారంభించనున్న ఈ పీటీబీలో మొత్తం 55 ఇమ్మిగ్రేషన్​ కౌంటర్లు ఉంటాయి. వీసా అవసరం లేకపోయినప్పటికీ యాత్రికులు పాస్​పోర్ట్​ను మాత్రం వారి వద్ద ఉంచుకోవాలి.

New Delhi, Oct 31 (ANI): Union Home Minister Amit Shah on October 31 said that the more the youth of the country know Sardar Vallabhbhai Patel the more they know the nation. "The more youths know Sardar Patel the more they know the nation and the more they incorporate Sardar, the more they move forward the nation," said Shah. Shah inaugurated new police headquarters in Jai Singh Marg.
Last Updated : Nov 1, 2019, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.